Webdunia - Bharat's app for daily news and videos

Install App

'మహానటి'ని కాటేసిన కరోనా వైరస్

Webdunia
మంగళవారం, 11 జనవరి 2022 (17:55 IST)
టాలీవుడ్ చిత్రపరిశ్రమలో "మహానటి"గా గుర్తింపుపొందిన హీరోయిన్ కీర్తి సురేష్ కరోనా వైరస్ బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ సందేశం ద్వారా అభిమానులకు తెలిపారు. ఇప్పటికే అనేక మంది సినీ ప్రముఖులు ఈ వైరస్ బారినపడిన విషయంతెల్సిందే. ఈ నేపథ్యంలో కీర్తి సురేష్ ఇపుడు కరోనా వైరస్ బారినపడ్డారు. ఇదే అంశంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
"నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయి. వైద్యుల సలహా మేరకు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసినవారందరూ కోవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రెండు వ్యాక్సిన్లు వేయించుకుని జాగ్రత్తగా ఉన్నప్పటికీ కరోనా వైరస్ సోకింది. దయచేసి ఇప్పటివరకు ఎవరైతే వ్యాక్సిన్ వేయంచుకోలేదో  వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే వ్యాక్సిన్ వల్ల తీవ్రమైన పరిణామాల నుంచి తప్పించుకోవచ్చు. మీ ప్రియమైన వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వొచ్చు. త్వరగా కోలుకుని మళ్లీ యాక్షన్‌లోకి  దిగుతాను" అంటూ ఆమె ట్వీట్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీకి భారీ వర్ష సూచన

Moving Train: కదులుతున్న ప్యాసింజర్ రైలు నుంచి పడిపోయిన మహిళ.. ఏం జరిగింది?

సుంకాల మోత... అమెరికాకు షాకిచ్చిన భారత్ - యుద్ధ విమానాల డీల్ నిలిపివేత?

YSRCP: వైఎస్ఆర్ కడప జిల్లాలో పోలింగ్ కేంద్రాలను తరలించవద్దు.. వైకాపా

Jangaon: ఆస్తి కోసం తల్లీకూతుళ్లను చంపేసిన ఇద్దరు మహిళలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments