Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఛాన్సులు లేక.. మతిస్థిమితం కోల్పోయి ముంబై రోడ్లపై అడుక్కుంటున్న హీరోయిన్!

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (12:41 IST)
సినిమా అనేది ఒక రంగుల లోకం. ఎవరి జీవితాలనైనా ఒక రాత్రికే మార్చేయగల సత్తా ఉన్న రంగం సినీరంగం. కొందరిని అందని ఆకాశానికెత్తేస్తుంది, మరికొందరిని పాతాళానికి తొక్కేస్తుంది. కొందరు అన్ని ఒడిదొడుకులను ఎదుర్కొని స్థిరపడితే, మ‌రికొంద‌రు ఇక్క‌డ సెటిల్ కాలేక అటు తిరిగి ఇంటికి వెళ్ల‌లేక తీవ్ర ఒత్తిడికి గురవుతుంటారు. ఇంతకీ అసలు విషయానికొస్తే బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తన సత్తాని చాటుకోవాలని ఎన్నో ఆశ‌ల‌తో వ‌చ్చిన ఓ అమ్మాయి హీరోయిన్ అయినా ఆ ఛాన్స్ నిలుపుకోలేక ఇప్పుడు ముంబై వీధుల్లో బిచ్చ‌మెత్తుకుంటోంది.
 
పూర్తి వివరాలకు వెళితే ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మకు సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా తానూ సినిమాలో హీరోయిన్ అవ్వాలనుకుంది. సినిమాలపై మోజుతో తల్లిదండ్రులు కాదన్నా ఆ రంగుల లోకంలోకి అడుగుపెట్టింది. అనుకున్నట్టే హీరోయిన్ అయింది. ఓ భోజ్‌పురి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఆ సినిమా బోల్తా కొట్టడంతో ఆమెకు ఎలాంటి సినిమా అవకాశాలు రాలేదు. దీంతో తిరిగి ఇంటికి వెళ్ల‌లేక తల్లిదండ్రులకు ముఖం చూపించుకోలేక నానా అవస్థలు పడింది. 
 
ఇంట్లో వాళ్ళకు మొహం చూపించలేక తనలో తానే బాధపడి చివరికి మతిస్థిమితం కోల్పోయి తిండి కోసం ముంబై నగర వీధుల్లో బిచ్చమెత్తుకుంటూ బ్రతుకుతోంది. ఒకరోజు ఆమె ఒష్విరా హౌసింగ్ సొసైటీలో నిలిచి ఉన్న కారు అద్దాలను పగులగొడుతూ పోలీసుల కంట పడింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదని గమనించిన మహిళా పోలీసులు ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె కన్నీటి కథ వెలుగులోకి వచ్చింది.

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments