Webdunia - Bharat's app for daily news and videos

Install App

మెగాస్టార్ చిరంజీవితో కోరిక అలానే మిగిలిపోయింది : ఆమని

Webdunia
శుక్రవారం, 24 ఫిబ్రవరి 2023 (11:05 IST)
Amani
మెగాస్టార్‌ చిరంజీవితో సినిమా చేయాలన్న కోరిక ఓ కలగానే మిగిలిపోయిందని సినీ నటి ఆమని అన్నారు. ఆమె తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందిస్తూ, తాను చిన్నప్పటి నుంచి చిరంజీవి అభిమానిని. హీరోయిన్‌గా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన సరసన నటిస్తే చాలని అనుకునేదాన్ని. ఓసారి చిరంజీవి "రిక్షావోడు" చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. ఇందులో తనను, సౌందర్యను ఎంచుకున్నారు. ఆ తర్వాత ఈ చిత్రానికి దర్శకుడు మారడంతో తన స్థానంలో నగ్మా వచ్చింది, అలా అందులో నటించే అవకాశాన్ని కోల్పోయాను.
 
నిజానికి "రిక్షావోడు" చిత్రంలో హీరోయిన్లుగా తనను, సౌందర్యను ఎంపిక చేశారు. ఆ సమయంలో నా స్నేహితురాలిగా సౌందర్య ఎంతో సంబరపడిపోయారు. కానీ, ఆ ఛాన్స్ చేజారినపుడు చాలా బాధపడ్డాను అని అన్నారు. అందుకే మెగాస్టార్‌తో సినిమా చేయాలనే కోరిక అలాగే ఉండిపోయింది. ఇక హీరో వెంకటేశ్‌తో సరసన కూడా హీరోయిన్‌గా నటించలేకపోయాను అని తన మనసులోని బాధను వెల్లడించారు. 
 
కాగా, నటకు ప్రధానమైన కథలను, మధ్యతరగతి గృహిణి పాత్రలను సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడంలో ఆమనికి మించిన నటి మరొకరు లేరని చెప్పొచ్చు. ఫలితంగానే ఆమె ఉత్తమ నటి అవార్డును కూడా అందుకున్నారు. "శుభలగ్నం" వంటి చిత్రాల్లో ఆమె అసమానమైన నటనకు అద్దంపడతాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

న్యూజిలాండ్‌లో కరోనా విజృంభణ - భారత్‌లో 5 వేలు దాటిన కరోనా

కస్టమర్ల FD రూ. 4.5 కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టేసిన బ్యాంక్ అధికారిణి, గోవిందా

Vijayawada: వైజాగ్ కాలేజీలకు డ్రగ్స్ సప్లై.. కొరియర్, క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపు, సరఫరా

మేఘాలయ హనీమూన్ కేసు: మా బావను చంపేసి నా సోదరిని కిడ్నాప్ చేసారేమో

Lion: సింహం అనుకున్నాడా? లేదా కుక్క అనుకున్నాడా? ఏం గుండె రా బాబు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments