Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓపీఎస్ - ఈపీఎస్... ఇద్దరిలో ఎవరైతే మాకేంటి.. మాకు ఒరిగేది ఏమీ లేదు: హీరో విశాల్

నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు విశాల్ తమిళనాడు ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు ఒరిగేది ఏంటన

Webdunia
మంగళవారం, 21 ఫిబ్రవరి 2017 (11:42 IST)
నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, సినీ నటుడు విశాల్ తమిళనాడు ముఖ్యమంత్రి ఈ.పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీరిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అయినా మాకు ఒరిగేది ఏంటని ఆయన ప్రశ్నించారు. 
 
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి తన బలాన్ని నిరూపించుకునే సమయంలో జరిగిన అవాంఛనీయ ఘటనలపై విశాల్ తాజాగా స్పందించారు. సభలో జరిగిన ఘటన చాలా దురదృష్టకరమన్నారు. ప్రజాప్రతినిధులు కనీసం చట్టసభల్లో సభ్యుల్లోనైనా హుందాగా మెలగాలని హితవు పలికారు. 
 
అదేసమయంలో ఈపీఎస్ (పళనిస్వామి) గెలిచినా, ఓపీఎస్ (పన్నీర్ సెల్వం) గెలిచినా తమకు ఒరిగేది ఏమీ లేదన్నారు. రాష్ట్రంలోని రైతులంతా కరవు కోరల్లో చిక్కుకున్నారని, అయినా రైతాంగాన్ని కాపాడే నాథుడే లేడని మండిపడ్డారు. ప్రస్తుత పాలకులైనా తమకు ఓటేసిన ప్రజల కష్టసుఖాలను పట్టించుకుంటారని ఆశపడుతున్నట్టు చెప్పారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments