Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసులో ఇరుక్కున్న మెర్సల్ హీరో తండ్రి.. తిరుపతి హుండీ కానుకలన్నీ లంచాలే..

తిరుపతి దేవస్థానంలో భక్తులు సమర్పించే కానుకలు ఆ దేవునికి లంచం ఇచ్చినట్టేనని నటుడు విజమ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రశేఖర్ కోర్టు కేసులో చిక్కుకున్నారు. గత నవంబరు న

Webdunia
ఆదివారం, 17 డిశెంబరు 2017 (14:10 IST)
తిరుపతి దేవస్థానంలో భక్తులు సమర్పించే కానుకలు ఆ దేవునికి లంచం ఇచ్చినట్టేనని నటుడు విజమ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు చేశారు. దీంతో చంద్రశేఖర్ కోర్టు కేసులో చిక్కుకున్నారు. గత నవంబరు నెలలో చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రశేఖర్ చేసిన వీడియో బయటకు రావడంతో వివాదంలో చిక్కుకున్నారు. 
 
ఆలయ హుండీల్లో కానుకలు వేస్తే పరిక్షల్లో ఉత్తీర్ణత కోసం ఇక పరిక్షలే రాయవలసిన అవసరం లేదని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై హిందు మున్నని సంఘం మండిపడింది. చంద్రశేఖర్‌ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరచేవిగా వున్నాయని చెన్నై పోలీస్‌ కమీషనర్‌ కార్యాలయంలో హిందు మున్నని సంఘం గత నెల 25వ తేదీన ఫిర్యాదు చేశారు. 
 
అయితే ఆ ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటీషన్‌లో దర్శకుడు ఎస్‌ఏ. చంద్రశేఖర్‌పై తగిన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఈ కేసు శనివారం న్యాయమూర్తి ఎంఎస్‌.రమేశ్‌ సమక్షంలో విచారణకు రాగా తగిన ఆధారాలుంటే దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌పై కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు.

సంబంధిత వార్తలు

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

మహానాడు వాయిదా.. ఎన్నికల ఫలితాల తర్వాత నిర్వహిస్తారా?

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments