Webdunia - Bharat's app for daily news and videos

Install App

కారు ప్రమాదం ఎలా జరిగిందంటే.. శబ్దానికి చెవులు వినిపించలేదు.. కళ్ళు కనిపించలేదు... రాజ్ తరుణ్

Webdunia
బుధవారం, 21 ఆగస్టు 2019 (11:35 IST)
హైదరాబాద్ నగరంలోని నార్సింగ్ ఔటర్ రింగ్ రోడ్డు (బాహ్య వలయాకార రహదారి)లో జరిగిన రోడ్డు ప్రమాదంపై టాలీవుడ్ యుహ హీరో రాజ్ తరుణ్ స్పందించారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత తాను అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు వచ్చిన వార్తలను ఆయన కొట్టిపారేశారు. ప్రమాదం జరిగిన తర్వాత తాను పరుగెత్తుకుంటూ సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్టు చెప్పారు.
 
ఈ ప్రమాదంలో ఆయన తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో వివరించారు. 'నార్సింగ్ సర్కిల్‌లో ఒక్కసారిగా కుడివైపు టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. దీంతో నేను కారుపై నియంత్రణ కోల్పోయాను. కారు ఒక్కసారిగా వెళ్లి పక్కనే ఉన్న గోడను బలంగా ఢీకొట్టింది. అప్పుడు వచ్చిన శబ్ధానికి నా రెండు చెవులు పనిచేయలేదు. చూపు కూడా సరిగ్గా కనిపించలేదు. గుండె దడ ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
ఈ ఘటన జరిగినప్పుడు నేను సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాను. నాకు దెబ్బలేమీ తగలలేదని నిర్ధారించుకున్నాక కారు నుంచి బయటపడ్డాను. ఆ ఆందోళనలో ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లాను. ఆరోజు రాత్రి జరిగింది ఇదే. మిగిలిన విషయాలు త్వరలోనే బయటకు వస్తాయి. త్వరలోనే మళ్లీ సినిమా షూటింగులో పాల్గొంటాను. మీ ప్రేమకు ధన్యవాదాలు' అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. పైగా, సీటు బెల్టే ప్రమాదం నుంచి తనను కాపాడిందనీ, సీట్ బెల్ట్ ధరించాలని సూచించాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మానసాదేవి ఆలయం తొక్కిసలాటకు కరెంట్ షాక్ పుకార్లే తొక్కిసలాటకు కారణం

ఇన్‌స్టా యువకుడి కోసం బిడ్డను బస్టాండులో వదిలేసిన కన్నతల్లి

ట్యూటర్‌తో అభ్యంతరకర స్థితిలో కోడలు ఉన్నట్టు నా కొడుకు చెప్పాడు...

వైకాపా పాలనలో జరిగిన నష్టాన్ని వడ్డీతో సహా తెస్తాం : మంత్రి నారా లోకేశ్

హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట.. భక్తుల మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments