Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎఫ్-క్లబ్ గుట్టువీడేనా : నేడు ఈడీ ముందుకు నవదీప్

Webdunia
సోమవారం, 13 సెప్టెంబరు 2021 (10:32 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ విచారణలో భాగంగా, సోమవారం నటుడు నవదీప్‌ను ఈడీ అధికారులు విచారించనున్నారు. 
 
మనీలాండరింగ్ వ్యవహారాలకు సంబంధించి నవదీప్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. డ్రగ్స్ సరఫరాదారు కెల్విన్‌తో లావాదేవీలపై ఈడీ ఆరా తీయనున్నట్టు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ ఇప్పటికే ఏడుగురు సినీ ప్రముఖులను విచారించింది.
 
టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ఈ నెల 8న హీరో దగ్గుబాటి రానాను ఈడీ విచారణకు హాజరయ్యాడు. నవదీప్ తో ఉన్న సంబందాలు, ఆర్థిక లావాదేవీలపై ఈడీ ప్రధానంగా విచారణ విచారించనున్నట్లు తెలుస్తోంది. 
 
కాగా, ఇప్పటివరకు హీరో రవితేజ, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ, రకుల్ ప్రీతి సింగ్ వంటి టాలీవుడ్ ప్రముఖులు ఈడీ విచారణకు హాజరైయ్యారు. ఎఫ్ కేఫ్ కేంద్రంగా సినీస్టార్స్‌కు డ్రగ్స్ సరఫరా అయినట్టు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు కెల్విన్.. సినీ తారలకు అక్కడే డ్రగ్స్‌ సరఫరా చేసినట్టుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతల పరువునష్టం కేసు.. కొట్టివేసిన తెలంగాణ హైకోర్టు

గుమస్తా ఉద్యోగి నెల వేతనం రూ.15 వేలు.. ఆస్తులు రూ.30 కోట్లు

Anil Ambani: రూ.17,000 కోట్ల రుణ మోసం కేసు.. అనిల్ అంబానీకి సమన్లు జారీ చేసిన ఈడీ

ఐదేళ్లలో మీరెంత తెచ్చారు? 14 నెలల్లో రూ. 45కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయ్: నారా లోకేష్

Byreddy Shabari: మహిళలు రాజకీయాల్లోకి వస్తారు.. ప్రత్యేక చట్టం కావాలి.. అలాంటి భాష వుండకూడదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

తర్వాతి కథనం
Show comments