Webdunia - Bharat's app for daily news and videos

Install App

మామిడి కాయల దుకాణం పెట్టిన హీరో నరేష్

Webdunia
బుధవారం, 23 జూన్ 2021 (15:04 IST)
అనేక మంది సినీ సెలెబ్రిటీలకు వ్యక్తిగతంగా పామ్‌హౌస్‌లు ఉన్నాయి. ఇక్కడ పండే పండ్లను తమ స్నేహితులు, బంధు మిత్రులకు పంపుతుంటారు. అలాంటి ఫాంహౌస్‌ను కలిగిన వారిలో సినీ నటుడు నరేష్ కూడా ఉన్నారు. 
 
తన ఫాంహౌస్ తోటలో పండించిన పండ్లను స్వయంగా అమ్మారు. లాక్డౌన్ సమయంలో వ్యవసాయంతో కాస్తంత టైంపాస్ చేసిన అతడు.. ఇప్పుడు ఫాంహౌస్‌లో తన చెట్లకు కాసిన పండ్లను తానే స్వయంగా కోశారు.  
 
ఆ మామిడి పండులు, నేరేడు పండ్లను ఆఫీసుకు తీసుకొచ్చి స్వయంగా విక్రయించారు. కిలో రూ.50 చొప్పున మొత్తం రూ.3,600 సంపాదించాడు. తన పండ్ల వ్యాపారం గురించి ఆయన ట్విట్టర్‌లో స్పందించారు.
 
సినీ నటుడిగా అత్యధిక పారితోషికం తీసుకున్నప్పుడు కలిగిన ఆనందం కన్నా.. ఇప్పుడు స్వయంగా వ్యవసాయం చేసి సంపాదించిన దాంతోనే ఎక్కువ ఆనందంగా ఉందని ట్వీట్ చేశారు. వ్యవసాయం చేయడంలోనే అసలైన మజా ఉందన్నారు. 
 
సేంద్రియ పద్ధతిలో తన ఫాంహౌస్‌లో పండించిన మామిడి, నేరేడు పండ్లను తానే స్వయంగా కోశాననీ, కిలో రూ.50కి అమ్మానని నరేశ్ చెప్పారు. ట్విట్టర్‌లో ఆయన పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి. ప్రస్తుతం అలీతో కలిసి ‘అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి’ అనే సినిమాలో ఆయన నటిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

NEET ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులొచ్చాయని కుమార్తెను చంపేసిన తండ్రి

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments