Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో పాగా వేసేందుకు బీజేపీకి టైమ్ రాలేదు : కమల్ హాసన్

తమిళనాడులో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి విశ్వనటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పాగా వేసేందుకు అపుడే సమయం రాలేదన్నారు.

Webdunia
మంగళవారం, 16 మే 2017 (09:41 IST)
తమిళనాడులో అడుగుపెట్టాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీని ఉద్దేశించి విశ్వనటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో బీజేపీ పాగా వేసేందుకు అపుడే సమయం రాలేదన్నారు. 
 
ఆయన తాజాగా ఓ అంగ్ల పత్రికకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో ఆయన మాట్లాడుతూ... తమిళనాడులో వేళ్లూనుకునే సమయం బీజేపీకి ఇంకా రాలేదన్నారు. తనకు సంబంధించినంత వరకు జాతీయ జెండా కనిపిస్తే తలవంచి నమస్కరిస్తానని చెప్పారు. తమిళనాడులో బీజేపీ పాగా వేసేందుకు ప్రయత్నిస్తోందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. 
 
బీజేపీకి తమిళనాడు అనుకూలిస్తుందా? లేదా? అన్న విషయం తనకు తెలియదని, అయితే బీజేపీకి తమిళనాడులో ఇంకా టైం రాలేదని వ్యాఖ్యానించారు. జాతీయ నాయకుడు ఒకరు తమిళ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు జరుగుతున్న ప్రచారంపై అడిగిన ప్రశ్నకు.. ఈ దేశంలో తమిళనాడు ఒక భాగం కాబట్టి రాష్ట్రాభివృద్ధిలో ఎవరైనా భాగం పంచుకోవచ్చని కమల్ హాసన్ స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Kodali Nani: కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఫోనులో ఆరా తీసిన జగన్.... ఆస్పత్రికి వెళ్లలేరా?

Polavaram: 2027 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి: చంద్రబాబు ప్రకటన

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments