Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాలీవుడ్ దర్శకుడు మనోజ్ కుమార్ ఇకలేరు...

ఠాగూర్
శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (08:36 IST)
బాలీవుడ్ చిత్రపరిశ్రమలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మనోజ్ కుమార్ (87) శుక్రవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ముంబైలోని కోకిలా బెన్ ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 
 
1937లో జన్మించిన మనోజ్ కుమార్... అసలు పేరు హరికృష్ణ గోస్వామి. 1957లో 'ఫ్యాషన్' అనే చిత్రంతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు. 'కాంచ్ కీ గుడియా' అనే సినిమా నటించి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత దర్శకుడుగా, రచయితగా, నటుడుగా ప్రేక్షకుల మనస్సుల్లో చెరగని ముద్ర వేశారు. ఎక్కువగా దేశభక్తి చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనకు పెట్టింది పేరు. దీంతో ఆయన పేరు కూడా మనోజ్ కుమార్ నుంచి భరత్ కుమార్‌గా మారిపోయింది. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన చిత్రపరిశ్రమకు సేవలు అందించారు. బాలీవుడ్‌లోని అగ్రహీరోలందరితో ఆయన కలిసి పనిచేశారు. 
 
ఆయన తెరకెక్కించిన అనేక చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్ మూవీలుగా నిలిచాయి. అమితాబ్ బచ్చన్ హీరోగా తెరకెక్కించిన 'రోటీ కపడా ఔర్ మకాన్' చిత్రం 1974లోనే అతిపెద్ద విజయం సాధించిన మూవీ చరిత్రపుటల్లో నిలిచిపోయింది. మనోజ్ కుమార్ తన కెరీర్‌లో ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. చిత్రపరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం గత 1982లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని చీల్చేందుకు మోడీ సర్కారు కుట్ర : మల్లికార్జున ఖర్గే

దోషి అని తేలితే ఉరి తీయండి.. సోనమ్ సోదరుడు

మహిళలు గౌరవంగా, ఆరోగ్యంగా జీవించాలనేది నా కోరిక : ఉపాస‌న కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

తర్వాతి కథనం
Show comments