Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త హీరో సెట్లోకి రాగానే లేచి నమస్కారం పెట్టాల్సి వస్తోంది: చంద్రమోహన్

టాలీవుడ్‌లో ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని సీనియర్ కథానాయకులలో ఒకరైన చంద్రమోహన్ అన్నారు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లు.. సీనియర్ నటులకు ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదని చంద్రమోహన్ వ్యాఖ్యానించారు. గతంలో తాము హ

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (16:51 IST)
టాలీవుడ్‌లో ప్రస్తుతం పరిస్థితి మారిపోయిందని సీనియర్ కథానాయకులలో ఒకరైన చంద్రమోహన్ అన్నారు. కొత్తగా వచ్చిన కుర్రాళ్లు.. సీనియర్ నటులకు ఏమాత్రం గౌరవం ఇవ్వట్లేదని చంద్రమోహన్ వ్యాఖ్యానించారు. గతంలో తాము హీరోలుగా నటించినా.. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోయేసరికి కొత్త హీరో సెట్లోకి రాగానే లేచి నిల్చుని నమస్కారం పెట్టాల్సి వస్తుందన్నారు. 
 
ఇక ఆ హీరో రెండేళ్ల తర్వాత ఉంటాడో లేదో కూడా తెలియదన్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి తాము ఎంతో క్రమశిక్షణతో నటనను నేర్చుకున్నామని, కానీ ప్రస్తుతం సీన్ మారిందని చంద్రమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. సీన్ ఇలా చేస్తే బాగుంటుందని కూడా నోరు విప్పి చెప్పకూడదని.. అలా ఓ హీరోకి చెప్పినందుకు దర్శకుడికి ఫిర్యాదు చేశాడని, దర్శకుడైతే ఆ హీరో జోలికి వెళ్లొద్దని దణ్ణం పెట్టేశాడని చంద్రమోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 
 
ఇంకా తనతో ఏ హీరోయిన్ నటించినా ఆ తరువాత టాప్ పొజీషన్‌కి వెళ్ళిపోతారని సెంటిమెంట్ వుండేది. ఇందుకోసం తనతో జోడీ కట్టేందుకు హీరోయిన్లు పోటీపడేవారని చంద్రమోహన్ తెలిపారు. రాధిక, విజయశాంతి, సులక్షణ, శ్రీదేవి, జయసుధ, జయప్రద వీళ్లంతా తనతో నటిస్తే టాప్ పొజిషన్‌కు వెళ్లిపోతామని భావించేవాళ్లు. 
 
ఈ సెంటిమెంట్ కాకతాళీయమేనని తాను నమ్మినా.. తనతో నటించిన హీరోయిన్లు తప్పకుండా అగ్రహీరోయిన్లుగా ఎదిగేవారని చెప్పారు. సెంటిమెంట్ కారణంగా మాధవి, రాధిక, విజయశాంతి తనతో ఏడెనిమిది సినిమాలు చేశారు. ఒక్క జయసుధతో మాత్రం 25 సినిమాల వరకూ చేశానని చంద్రమోహన్ గుర్తు చేసుకున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏలూరు కలెక్టరేట్‌లో కరోనా కలకలం- ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్

హౌస్ కీపింగ్ యువకుడికి ఐ లవ్ యు చెప్పిన లేడీ డాక్టర్, ఆ తర్వాత ఏం జరిగింది?

Twin infants: డ్రైనేజీ కాలువలో కవల శిశువులు.. కాలువలో కొట్టుకుపోయారా? లేక పడేశారా?

Mega DSC: మెగా డీఎస్సీ-2025 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదు.. ఏపీ సర్కారు

Raja Singh: ఇంటిదొంగలంతా ఒక్కటైయ్యారు- బీజేపీలో బీఆర్‌ఎస్ నిజమేనేమో: రాజా సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments