Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాష్ట్రంలో పాలన గాడి తప్పింది.. ఆ దేవుడే రక్షించాలి : నటుడు పృథ్వీ

Webdunia
గురువారం, 8 డిశెంబరు 2022 (15:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పాలనపై వైకాపా మాజీ నేత, సినీ నటుడు పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. అందువల్ల రాష్ట్రాన్ని ఇక ఆ దేవుడే కాపాడాలని అభిప్రాయపడ్డారు. ఈయన ప్రస్తుతం ఏపీ జీరో ఫోర్ రామాపురం అనే చిత్రంలో నటించారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంకాగా, చిత్ర బృందం కడప పెద్ద దర్గాను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. 
 
ఈ సందర్భంగా పృథ్వీ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలిసిందేనని చెప్పారు. ఇవాళ ఉర్సు సందర్భంగా దర్గా వద్దకు వచ్చామని, ఉర్సు రోజున ఆ భగవంతుడే రాష్ట్రాన్ని కాపాడాలని  అన్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో పాలన ఎపుడో గాడి తప్పిందన్నారు. అందువల్ల రాష్ట్రాన్ని ఆ దేవుడే రక్షించాలని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
"పెళ్లి చేసుకుని 15 లేదా 25 సంవత్సరాలు సజావుగా కాపురం చేస్తాం. కుదరకపోతే విడిపోతాం. ఇదీ అంతే.. ఏమైనా బాండ్ రాసి వచ్చామా, ఏదైనా బొట్టు పెట్టి వచ్చామా? పద్ధతులు నచ్చకపోతే పార్టీ నుంచి బయటకు వచ్చేశాను. పార్టీలో ఉన్నంత కాలం చిత్తశుద్ధితో కష్టపడి పనిచేశాను. నా మీద ఆరోపణలు చేసిన వారు ఇక్కడికి వచ్చి అల్లా సాక్షిగా ప్రమాణం చేయమనండి... నీతి నిజాయితీ ఉందా? లేదా? అనేది తెలిసిపోతుంది" అంటూ పృథ్వీ వ్యాఖ్యానించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Selfi: ఎంత ధైర్యం.. ఆడ చిరుతలతో సెల్ఫీలు వీడియో తీసుకున్నాడా? (video)

బైటకు రావద్దు తలాహ్ సయీద్, నిన్నూ లేపేయొచ్చు: పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వార్నింగ్

China: సింధు జలాల నిలిపివేత.. పాకిస్థాన్‌లో ఆ పనులను మొదలెట్టిన చైనా.. ఏంటది?

Jyoti Malhotra: పాకిస్థాన్ ఎంబసీలోకి కేక్ తీసుకెళ్లిన వ్యక్తితో జ్యోతి మల్హోత్రాకు ఏం పని?

జ్యోతి మల్హోత్రా కేసులో విస్తుపోయే నిజాలు.. అతనితో కూడా సంబంధాలు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments