Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సానా కష్టం వచ్చిందే మందాకినీ...' అంటున్న "ఆచార్య" (Song Promo)

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (17:02 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "ఆచార్య". కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా, మ్యాట్నీ మూవీ మేకర్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిలు కలిసి నిర్మిస్తున్నారు. హీరో రామ్ చరణ్ కీలక పాత్రను పోషించిన ఈ చిత్రం ఈ యేడాది ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
అయితే, ఈ చిత్రంలోని పాటలను అపుడపుడూ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే "లాహె లాహె", "నీలాంబరీ" పాటలను రిలీజ్ చేయగా, వాటికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తాజాగా "సానా కష్టం వచ్చిందే మందాకినీ.. చూసేవాళ్ళ కళ్లు కాకులెత్తుకుపోనీ... సానా కష్టం వచ్చిందే మందాకినీ.. నీ నడుము మడతలోన జనం నలిగిపోనీ..." అంటూ ఈ పాట ప్రోమోను రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చారు. ఈ పాట ఐటమ్ సాంగ్‌లా కనిపిస్తుంది. 
 
ఈ చిత్రంలో గిరిజనలు బతుకు చిత్రాలను కళ్లకు కట్టిలా దర్శకుడు చూపించనున్నట్టు ఇప్పటికే విడుదలైన చిత్ర ప్రోమోల ద్వారా స్పష్టమైంది. లాహె లాహె పాట గిరిజన సంస్కృతిని ప్రతిబింభించేలా వుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్.
 

సంబంధిత వార్తలు

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments