Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో "ఆచార్య" సినిమా టిక్కెట్ ధరలు ఇవే...

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:00 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకుడు. మెగా తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా 29వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ధరలను ఖరారు చేసింది. 
 
ఈ చిత్రం విడుదలైన తర్వాత పది రోజుల పాటు నాన్ ప్రీమియం, ప్రీమియం అన్న తేడా లేకుండా అన్ని కేటగిరీలపైనా రూ.50 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఫలితంగా ఇప్పుడు ఆ సినిమా కనీస టికెట్ ధర రూ.70కి చేరుకుంది. అలాగే, మల్టీప్లెక్స్‌లలో గరిష్ఠంగా రూ.300 చేరుకుంది. 
 
కాగా, మార్చి 7న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేదలకు సినిమా వినోదాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లు నాన్ ప్రీమియం కేటగిరీకి కేటాయించాలని ఆదేశించింది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు నాన్  ప్రీమియం, ప్రీమియం అన్న తేడా లేకుండా అన్ని కేటగిరీలకు ఒకేలా ధరలు పెంచుకోవచ్చని పేర్కొంది. 
 
కాగా, ఇటీవల విడుదలైన "రాధేశ్యామ్", "ఆర్ఆర్ఆర్" సినిమాలకు కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు విడుదల చేసిన పవన్ కల్యాణ్ సినిమా "భీమ్లానాయక్" సినిమాకు మాత్రం ఇలాంటి అవకాశం లేకుండాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments