Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్‌లో "ఆచార్య" సినిమా టిక్కెట్ ధరలు ఇవే...

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (10:00 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకుడు. మెగా తనయుడు రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా 29వ తేదీన విడుదలకానుంది. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా ధరలను ఖరారు చేసింది. 
 
ఈ చిత్రం విడుదలైన తర్వాత పది రోజుల పాటు నాన్ ప్రీమియం, ప్రీమియం అన్న తేడా లేకుండా అన్ని కేటగిరీలపైనా రూ.50 పెంచుకునేందుకు అనుమతినిచ్చింది. ఫలితంగా ఇప్పుడు ఆ సినిమా కనీస టికెట్ ధర రూ.70కి చేరుకుంది. అలాగే, మల్టీప్లెక్స్‌లలో గరిష్ఠంగా రూ.300 చేరుకుంది. 
 
కాగా, మార్చి 7న ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో పేదలకు సినిమా వినోదాన్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రతి థియేటర్‌లో కనీసం 25 శాతం సీట్లు నాన్ ప్రీమియం కేటగిరీకి కేటాయించాలని ఆదేశించింది. పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు నాన్  ప్రీమియం, ప్రీమియం అన్న తేడా లేకుండా అన్ని కేటగిరీలకు ఒకేలా ధరలు పెంచుకోవచ్చని పేర్కొంది. 
 
కాగా, ఇటీవల విడుదలైన "రాధేశ్యామ్", "ఆర్ఆర్ఆర్" సినిమాలకు కూడా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అంతకుముందు విడుదల చేసిన పవన్ కల్యాణ్ సినిమా "భీమ్లానాయక్" సినిమాకు మాత్రం ఇలాంటి అవకాశం లేకుండాపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

గంజాయి మత్తు.. వీపుకు వెనక కొడవలి.. నోరు తెరిస్తే బూతులు.. యువత ఎటుపోతుంది.. (video)

Mithun Reddy: మద్యం కుంభకోణం .. మిథున్ రెడ్డిపై లుకౌట్ నోటీసులు

డబ్బు కోసం పెళ్లిళ్ల వ్యాపారం : ఏకంగా 11 మందిని పెళ్ళాడిన మహిళ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments