Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ మలయాళ దర్శకుడు సేతుమాధవన్ కన్నుమూత

Webdunia
శుక్రవారం, 24 డిశెంబరు 2021 (12:32 IST)
ప్రముఖ మలయాళ దర్శకుడు కేఎస్. సేతుమాధవన్ కన్నుమూశారు. వయోభారం, ఇతర వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన శుక్రవారం మృతి చెందారు. ప్రస్తుతం ఆయన వయసు 90 యేళ్లు. ఈయన మృతివార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 
 
ఇదిలావుంటే, విశ్వనటుడు కమల్ హాసన్‌ను మలయాళ చిత్రపరిశ్రమకు పరిచయం చేసింది ఈయనే కావడం గమనార్హం. 1931లో కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాలో జన్మించిన సేతుమాధవన్.... 1961లో మాతృభాషలో దర్శకుడుగా అరంగేట్రం చేశారు. 
 
ఆ తర్వాత ఆయన మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో 60కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1991లో 'మరుక్కమ్' అనే తమిళ చిత్రానికి ఉత్తమ దర్శకుడు అవార్డును అందుకున్నారు. 1995లో తెలుగులో "స్త్రీ'' అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. 

ఈయన చిత్ర పరిశ్రమకు చేసిన సేవలకు గాను 10 జాతీయ చలనచిత్ర అవార్డులు, 9 కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు వరించాయి. ఈయనకు భార్య వత్సల, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కమల్ హాసన్‌ను "కన్నుమ్ కరాలుమ్" అనే చిత్రంలో బాలనటుడుగా పరిచయం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments