Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు.. ఇక సీబీఐకి.. కేంద్రం గ్రీన్‌సిగ్నల్

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (15:33 IST)
sushanth singh
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ విచారణకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. బీహార్ పోలీసుల విచారణను సవాలు చేస్తూ సినీ నటి రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ సమాచారాన్ని సుప్రీం కోర్టుకు తెలియజేశారు.
 
సుశాంత మరణం కేసు విచారణ ముంబయిలో జరపాలని రియా చక్రవర్తి తన పిటిషన్‌లో అభ్యర్థించారు. కొద్ది రోజుల క్రితం సుశాంత్ సింగ్ తండ్రి కేకే సింగ్ పట్నా పోలీసు స్టేషన్‌లో రియాకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఆమెపై ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. 
 
సుశాంత్ సింగ్ నుంచి రియా డబ్బులు తీసుకున్నారని, ఆయన ఆత్మహత్యకు కారణమయ్యారని కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలనే బీహార్ విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. కాగా, జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని తన ఫ్లాట్‌లో ప్రాణాలు లేకుండా కనిపించారు. ముంబయి పోలీసులు దీన్ని ఆత్మహత్య కేసుగా భావిస్తూ, విచారణ చేపట్టారు.
 
రియా చక్రవర్తీతో సహా హిందీ సినీరంగానికి చెందిన కొందరు ప్రముఖులను ముంబయి పోలీసులు ఈ కేసు విషయమై ప్రశ్నించారు. మహేశ్ భట్, సంజయ్ లీలా భన్సాలీ వంటి వారు కూడా ఇందులో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: 15 రోజుల నవజాత శిశువును రిఫ్రిజిరేటర్‌లో పెట్టిన 23 ఏళ్ల మహిళ.. ఎక్కడ?

గాఢ నిద్రలో వున్న భర్త గొంతు పిసికి మర్మాంగాలపై దాడి చేసిన భార్య, ఎందుకంటే?

Nara Lokesh : కవితను టీడీపీలోకి తీసుకోవడం జగన్‌తో పొత్తు పెట్టుకోవడం ఒకటే

ప్రజలకు పనికొచ్చే వ్యాజ్యాలు వేయండి, పవన్ ఫోటోపై కాదు: హైకోర్టు చురకలు

Thar: టైర్ కింద నిమ్మకాయ పెట్టి యాక్సిలేటర్ అదిమింది.. కారు ఫస్ట్ ఫ్లోర్ నుంచి..? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

ఆధునిక వాస్కులర్ సర్జరీ అవయవాలు, ప్రాణాలను ఎలా కాపాడుతుంది?

తర్వాతి కథనం
Show comments