Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో విలేకరి విడాకుల ప్రశ్న, బుద్ధీ బుర్రా వుందా అంటూ సమంత ఆగ్రహం

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (20:02 IST)
అసలే స్టార్ హీరోయిన్. ఆపై ఈమధ్య విడాకులు అంటూ ఒకటే చర్చ. దీనితో సమంత, నాగచైతన్యలు ఎక్కడైనా కనబడతారా అంటూ ఎదురుచూసేవారు ఎక్కువయ్యారు. ఎందుకంటే.... అసలు విడాకులు అంటూ మీడియా కోడై కూస్తున్నా అటు సమంత కానీ ఇటు చైతన్య కానీ మౌనం వహిస్తున్నారు. దీనితో అక్కినేని ఫ్యాన్స్ మరింత ఆందోళన చెందుతున్నారు.
 
ఇక అసలు విషయానికి వస్తే... సమంత అక్కినేని మనశ్శాంతి కోసం శనివారం వేకువ జామున తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆమె వచ్చిందని తెలియగానే స్థానిక జర్నలిస్టులు చుట్టుముట్టారు. కొందరు మాస్కు తీయండి మేడం అని అడిగితే... మరికొందరు విడాకులపై ప్రశ్న సంధించేందుకు ప్రయత్నించారు. ఒక విలేకరి ఆమెకి వినబడేట్లు.. విడాకులు అనుకుంటున్నారు దీనిపై ఏం చెప్తారు మేడం అనేసరికి సమంత తీవ్ర ఆగ్రహానికి లోనయ్యింది. 
 
గుడికి వచ్చాను. ఇలాంటివి అడిగేందుకు నీకు బుద్ధుందా... అనడమే కాకుండా నీకు బుర్ర లేదంటూ తలపై చేయి పెట్టి సైగ చేస్తూ వేగంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. దీనితో అక్కడి వారంతా అలాగే గుడ్లప్పగించి చూస్తూ వున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments