Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు వెండితెరపై మరో బయోపిక్ - ధృవీకరించిన కోన వెంకట్

Webdunia
సోమవారం, 1 జూన్ 2020 (13:44 IST)
తెలుగు వెండితెరపై మరో బయోపిక్ ఆవిష్కృతం కానుంది. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కోన వెంకట్ ధృవీకరించారు. భారత మల్లయోధురాలు, ఒలింపిక్స్ పతక విజేత కరణం మల్లీశ్వరి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని మల్లీశ్వరి పుట్టిన రోజైన జూన్ ఒకటో తేదీని పురస్కరించుకుని కోన వెంకట్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
జూలై ఒకటో తేదీ సోమవారం కరణం మల్లీశ్వరి పుట్టిన రోజు కాగా, మరో నిర్మాత ఎంవీవీ సత్యనారాయణతో కలిసి ఎంవీవీ సినిమా, కేఎఫ్సీ (కోనా ఫిల్మ్ కార్పొరేషన్) ఈ సినిమాను నిర్మించనున్నట్టు కోన వెంకట్ తెలిపారు. ఇది పాన్ ఇండియా చిత్రమని ఆయన స్పష్టం చేశారు. 
 
సినిమాలో కరణం మల్లీశ్వరి పాత్రను చేసే హీరోయిన్ ఎవరన్న విషయమై ఆయన ఎటువంటి స్పష్టతనూ ఇవ్వలేదు.  ఈ సినిమాకు సంజనా రెడ్డి దర్శకత్వం వహించనున్నారు. సినిమాలో నటీనటులు, ఇతర వివరాలు తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు.
 
కాగా, భారతదేశం తరపున ఒలింపిక్స్ పోటీల్లో పతకం సాధించిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. 2000 ఒలింపిక్స్‌లో మల్లీశ్వరి భారత ఖ్యాతిని దిగంతాలకు వ్యాపింపజేసిన సంగతి తెలిసిందే. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రోజాపువ్విచ్చి ప్రపోజ్ చేస్తే.. ఫ్యాంటు జారిపోయి పరువంతా పోయింది... (Video)

కుంభ‌మేళ‌లో పూస‌ల‌మ్మే మోనాలిసాపై దాష్టీకం (Video)

జనసేనకు శుభవార్త... గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ....

Monalisa Bhonsle కుంభమేళలో దండలమ్ముకునే యువతి మోనాలిసాకి బాలీవుడ్ బంపర్ ఆఫర్

తెలంగాణలోకి కింగ్‌ఫిషర్ బీర్.. ఇక మందుబాబులకు పండగే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యునిసెఫ్‌తో కలిసి తిరుపతిలో 'ఆరోగ్య యోగ యాత్ర' ఫాగ్సి జాతీయ ప్రచారం

Winter Stroke శీతాకాలంలో బ్రెయిన్ స్ట్రోక్, నివారించే మార్గాలు

ప్రతిరోజూ బాదం తినడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలు

Golden Milk: గోల్డెన్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్

అంజీర్ పండ్లు అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments