Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన మరాఠీ నటుడు

Webdunia
గురువారం, 30 జులై 2020 (11:22 IST)
Ashutosh Bhakre
బాలీవుడ్‌లో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు. మరాఠీ నటుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన నివాసంలో నటుడు అశుతోష్ భక్రే (32) ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి అతడు గురౌతున్నాడని బంధువులు చెబుతున్నారు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. నాందెడ్‌లోని గణేష్ నగర్ ప్రాంతంలో ఉంటున్న అశుతోష్ భక్రే తీవ్ర మానసిక ఆందోళనకు గురౌతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరివేసుకున్నాడు. 
 
కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అతడు విగత జీవిగా కనిపించాడు. కాగా అతడు 'భకార్, ఇచర్ థార్లా' లాంటి మరాఠీ సినిమాల్లో నటించాడు. ఆయన భార్య మయూరి దేశ్ ముఖ్ కూడా 'ఖుల్తా కాళీ ఖులేనా' అనే సీరియల్‌లో నటిగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments