Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన మరాఠీ నటుడు

Webdunia
గురువారం, 30 జులై 2020 (11:22 IST)
Ashutosh Bhakre
బాలీవుడ్‌లో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నటుడు ప్రాణాలు కోల్పోయాడు. మరాఠీ నటుడు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన నివాసంలో నటుడు అశుతోష్ భక్రే (32) ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా తీవ్ర మానసిక ఒత్తిడికి అతడు గురౌతున్నాడని బంధువులు చెబుతున్నారు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. నాందెడ్‌లోని గణేష్ నగర్ ప్రాంతంలో ఉంటున్న అశుతోష్ భక్రే తీవ్ర మానసిక ఆందోళనకు గురౌతున్నాడు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేనిది చూసి ఉరివేసుకున్నాడు. 
 
కుటుంబ సభ్యులు వచ్చి చూడగా అతడు విగత జీవిగా కనిపించాడు. కాగా అతడు 'భకార్, ఇచర్ థార్లా' లాంటి మరాఠీ సినిమాల్లో నటించాడు. ఆయన భార్య మయూరి దేశ్ ముఖ్ కూడా 'ఖుల్తా కాళీ ఖులేనా' అనే సీరియల్‌లో నటిగా ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

తర్వాతి కథనం
Show comments