Webdunia - Bharat's app for daily news and videos

Install App

'2.O' మూవీకి షాక్... తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లో పైరసీ

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (17:02 IST)
శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ - అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "2పాయింట్ఓ". ఈ చిత్రం గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. మార్నింగ్ షో నుంచే హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రానికి తేరుకోలేని షాక్ తగిలింది.
 
ఈ చిత్రం విడుదలైన కొన్ని గంటల్లోనే పైరసీభూతం వెంటాడింది. తమిళ రాకర్స్ అనే వెబ్‌సైట్లో ఈ చిత్రం పైరసీ వీడియో అందుబాటులోకి వచ్చింది. ఈ హఠాత్పరిణామంపై చిత్ర నిర్మాతలతో పాటు యూనిట్ సభ్యులు తీవ్రఆందోళన చెందుతున్నారు. సదరు వెబ్‌సైట్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలంటూ మండిపడుతున్నారు.
 
సుమారుగా 550 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే, బయ్యర్లు కూడా భారీ మొత్తం వెచ్చించి చిత్రాన్ని కొనుగోలు చేశారు. ఈ చిత్రం ఓపెనింగ్స్‌పరంగా మంచి కలెక్షన్లు వస్తాయని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. గత చిత్రాల రికార్డులన్నీ ఈ మూవీ తిరగరాస్తొందని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. 
 
ఇంతలోనే ఈ చిత్రం పైరసీ తమిళ రాకర్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రావడం ఇపుడు నిర్మాతలతో పాటు రజనీకాంత్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. అదీ కూడా హెచ్‌డీ రిజల్యూషన్‌లో దర్శనమివ్వడం ఇపుడు ఆందోళన కలిగించే అందంగా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments