Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజినీకాంత్ 'రోబో 2.0' గ్రాఫిక్స్ కోసం రూ.100 కోట్ల బడ్జెట్

Webdunia
సోమవారం, 9 మే 2016 (12:07 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ''రోబో''. దీనికి సీక్వెల్‌గా ''రోబో 2.0'' తెరకెక్కుతున్నవిషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రానికి ఏ.ఆర్.రహమాన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నాడు.
 
భారత సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతోంది. అందమైన లోకేషన్స్‌లో, భారీ బడ్జెట్‌తో, భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ పనులకోసం దర్శకుడు ఏకంగా 100 కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 
 
నిర్మాతలు కూడా ఈ చిత్రం విషయంలో ఏ విధంగా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ విజువల్ ఎఫెక్ట్స్ కోసం మొత్తం ఏడు పేరు మోసిన సంస్థల నుంచి వందల మంది బృందాలుగా ఏర్పడి పనులు మొదలుపెడుతున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇజ్రాయెల్‌ నిబద్ధతపై అనుమానాలు : ఇరాన్

ఏపీలో మూడు రోజుల విస్తారంగా వర్షాలు

సింగయ్య మృతి కేసు : ఆ కారు జగన్మోహన్ రెడ్డిదే..

బంగ్లాదేశ్‌లో హిందూ మహిళపై అత్యాచారం

మాజీ సీఎం జగన్‌కు షాకివ్వనున్న జొన్నలగడ్డ పద్మావతి దంపతులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments