Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ షోలను రాత్రి 11 తర్వాత ప్రసారం చేయండి: ప్రభుత్వం

Webdunia
రియాల్టీ షోలపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తున్న నిరసనలపై ప్రభుత్వం స్పందించింది. ఇటువంటి షోలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని సమాచార, ప్రసారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న "బిగ్ బాస్", రాఖీ సావంత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న "రాఖీ కా ఇన్సాఫ్" షోలను ఈ సమయంలో ప్రసారం చేయాలని ఆ శాఖ కోరింది.

ఈ రెండు షోలు సార్వత్రిక ప్రదర్శన కోసం కాదని, ప్రతిపాదించిన సమయంలోనే వీటిని ప్రసారం చేయాలని సమాచార, ప్రసారాల శాఖ అధికారులు తెలిపారు. ఈ షోలను మరే ఇతర సమయంలోకానీ, లేదా వార్తా ప్రసారాలలో కానీ.. పున:ప్రసారం చేయకూడదని వారు స్పష్టం చేశారు.

కలర్స్ టివి ఛానెల్‌లో బిగ్ బాస్ ప్రసారమవుతుండగా.. ఇమాజిన్ టివి ఛానెల్‌లో రాఖీ కా ఇన్సాఫ్ ప్రసారమవుతుంది. అంతే కాకుండా.. ఎస్ఎస్ మ్యూజిక్ అనే టివి ఛానెల్ వారం రోజుల పాటు అశ్లీల దృశ్యాలు ప్రసారం చేసినందుకు గానూ.. ఆ ఛానెల్‌పై మంత్రిత్వ శాఖ నిషేధాన్ని విధించింది.

రాఖీ సావంత్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాఖీ కా ఇన్సాఫ్ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్‌ అనే కుర్రాడిని అవమానించి అతడి మృతికి కారణం కావడంతో.. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇటువంటి షోలను పూర్తిగా నిషేధించాలని మహిళా సంఘాలు ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేదర్నాథ్ హైవేపై హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్

వివాహేతర సంబంధం: భార్య తల నరికి స్కూటర్ ఫుట్‌బోర్డుపై పెట్టుకెళ్తున్న భర్త

మూడేళ్ల పాపపై అత్యాచారం-తాటతీసిన పోలీసులు- 20 గంటల్లో ఎన్‌కౌంటర్ చేసేశారు..

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

Warangal: వరంగల్‌ ప్రభుత్వ కార్యాలయం ఉద్యోగుల రాసలీలలు- లిప్ లాక్‌లు, కౌగిలింతలు..(video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

Show comments