Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ షోలను రాత్రి 11 తర్వాత ప్రసారం చేయండి: ప్రభుత్వం

Webdunia
రియాల్టీ షోలపై దేశవ్యాప్తంగా వెల్లువెత్తున్న నిరసనలపై ప్రభుత్వం స్పందించింది. ఇటువంటి షోలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలలోపు ప్రసారం చేయాలని సమాచార, ప్రసారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న "బిగ్ బాస్", రాఖీ సావంత్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న "రాఖీ కా ఇన్సాఫ్" షోలను ఈ సమయంలో ప్రసారం చేయాలని ఆ శాఖ కోరింది.

ఈ రెండు షోలు సార్వత్రిక ప్రదర్శన కోసం కాదని, ప్రతిపాదించిన సమయంలోనే వీటిని ప్రసారం చేయాలని సమాచార, ప్రసారాల శాఖ అధికారులు తెలిపారు. ఈ షోలను మరే ఇతర సమయంలోకానీ, లేదా వార్తా ప్రసారాలలో కానీ.. పున:ప్రసారం చేయకూడదని వారు స్పష్టం చేశారు.

కలర్స్ టివి ఛానెల్‌లో బిగ్ బాస్ ప్రసారమవుతుండగా.. ఇమాజిన్ టివి ఛానెల్‌లో రాఖీ కా ఇన్సాఫ్ ప్రసారమవుతుంది. అంతే కాకుండా.. ఎస్ఎస్ మ్యూజిక్ అనే టివి ఛానెల్ వారం రోజుల పాటు అశ్లీల దృశ్యాలు ప్రసారం చేసినందుకు గానూ.. ఆ ఛానెల్‌పై మంత్రిత్వ శాఖ నిషేధాన్ని విధించింది.

రాఖీ సావంత్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రాఖీ కా ఇన్సాఫ్ కార్యక్రమంలో పాల్గొన్న లక్ష్మణ్‌ అనే కుర్రాడిని అవమానించి అతడి మృతికి కారణం కావడంతో.. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. ఇటువంటి షోలను పూర్తిగా నిషేధించాలని మహిళా సంఘాలు ఆందోళన చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

Show comments