Webdunia - Bharat's app for daily news and videos

Install App

ద్యావుడా.. ఎస్వీబీసీ యాంకర్‌గా శ్రీరెడ్డి..?

తెలుగు సినీపరిశ్రమలో అవకాశాల కోసం నానా తంటాలు పడుతోంది శ్రీరెడ్డి. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో పాటు కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతల పేర్లు బయటపెట్టి సంచలనాలకు శ్రీరెడ్డి తెరలేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు న్యూస్ ఛానళ్ళలో

Webdunia
గురువారం, 19 ఏప్రియల్ 2018 (18:48 IST)
తెలుగు సినీపరిశ్రమలో అవకాశాల కోసం నానా తంటాలు పడుతోంది శ్రీరెడ్డి. హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ ముందు అర్థనగ్న ప్రదర్శన చేయడంతో పాటు కొంతమంది డైరెక్టర్లు, నిర్మాతల పేర్లు బయటపెట్టి సంచలనాలకు శ్రీరెడ్డి తెరలేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు న్యూస్ ఛానళ్ళలో ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ తిరుగుతోంది తప్ప ఎక్కడా శ్రీరెడ్డికి అవకాశాలు మాత్రం రావడం లేదు. కానీ తాజాగా శ్రీరెడ్డికి అదిరిపోయే ఆఫర్ ఇవ్వనున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.
 
అది కూడా ప్రపంచ వ్యాప్తంగా టెలికాస్ట్ అవుతున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లోనే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకు ఎస్వీబీసీ ఛైర్మన్‌గా అవకాశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధమైనట్లు చెప్పుకుంటున్నారు. మరో రెండు, మూడురోజుల్లో రాఘవేంద్రరావును ఈ పదవి వరించనుంది. ఆ తరువాత కొత్త యాంకర్లను ఎస్వీబీసీలోకి తీసుకురావాలన్న ఆలోచనలో ఉన్నారట దర్శకేంద్రుడు. ఇప్పటికే సంచలనంగా మారిన శ్రీరెడ్డి లాంటి వ్యక్తిని ఎస్వీబీసీలో తీసుకుంటే టిఆర్‌పి పెరగడంతో పాటు తెలుగు అమ్మాయికి అవకాశం ఇచ్చినట్లుగా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నారట దర్శకేంద్రుడు.
 
ఇదే విషయమై ఇప్పటికే రాఘవేంద్రరావు శ్రీరెడ్డితో ఫోన్‌లో మాట్లాడినట్లు కూడా తెలుస్తోంది. అవకాశం ఇస్తే ఖచ్చితంగా యాంకర్‌గా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని శ్రీరెడ్డి చెప్పినట్లు కూడా తెలుస్తోంది. ఇదంతా బాగానే ఉన్నా శ్రీరెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆమెను వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో యాంకర్‌గా పెడితే దర్శకేంద్రుడు మరింత చిక్కుల్లో పడే అవకాశం లేకపోలేదు. ఆధ్మాత్మిక ఛానల్లో శ్రీరెడ్డి లాంటి అమ్మాయిని యాంకర్ ను నియమిస్తే ఛానల్ కు చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంటుందని భక్తులే చెప్పక మానరు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దర్సకేంద్రుడు ఏ విధంగా శ్రీరెడ్డిని ఎస్వీబీసీలోకి తీసుకువస్తారనేది వేచి చూడాల్సిందే.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments