Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోపీచంద్‌ రెండు సినిమాలు ఆగిపోయాయా!

నటుడు గోపీచంద్‌ సినిమాలు వరుసగా చేస్తున్నాడు. 'ఆక్సిజన్‌' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఎ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల షెడ్యూల్‌ ఆగిపోయింది. గతంలో కూడా జ్యోతికృష్ణ సారధ్యంలో తరుణ్‌తో చేసిన సినిమా

Webdunia
మంగళవారం, 25 అక్టోబరు 2016 (21:08 IST)
నటుడు గోపీచంద్‌ సినిమాలు వరుసగా చేస్తున్నాడు. 'ఆక్సిజన్‌' పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఎ.ఎం. రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా కొన్ని కారణాల వల్ల షెడ్యూల్‌ ఆగిపోయింది. గతంలో కూడా జ్యోతికృష్ణ సారధ్యంలో తరుణ్‌తో చేసిన సినిమా అర్థంతరంగా ఆగిపోయింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్‌ తీసుకుని.. మరలా ఆయన చేస్తున్న ఈ సినిమా ఎందుకు ఆగిపోయిందనేందుకు ఆసక్తికర విషయాలు బయటకొస్తున్నాయి.
 
దర్శకుడికి.. హీరోకు మధ్య సమన్వయం సరిగ్గా కుదరక ఆపేసినట్లు తెలుస్తోంది. కాగా, అంతకుముందే గోపీచంద్‌, నయనతార కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందింది. ఆ చిత్రమూ నిర్మాత వేరే వ్యాపారంలో వుంటూ.. ఆపేశాడు. దాంతో.. రెండు చిత్రాలు ఆగిపోయినట్లయింది. అయితే.. ఇటీవలే మరలా ఆ సినిమాను ముందుకు తెస్తున్నట్లు స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు దానికి గురించి సరైన వివరణే చిత్ర యూనిట్‌కు తెలియదట. సో.. ఇలా జరుగతుండగా.. ప్రస్తుతం గోపీచంద్‌.. సంపత్‌నంది దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నట్లు వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఆ చిత్రం సెట్‌పై ఉంది.

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments