Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి'లో చిరంజీవి... ఆలింగనం చేసుకుని ఆహ్వానించిన ప్రభాస్ - రాజమౌళి

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'బాహుబలి' ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. గత కొంతకాలంగా ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ బడ్జె

Webdunia
శనివారం, 22 అక్టోబరు 2016 (10:03 IST)
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'బాహుబలి' ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. గత కొంతకాలంగా ఈ సినిమాలో ముఖ్య సన్నివేశాలను రామోజీ ఫిలింసిటీలో తెరకెక్కిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌ట్రైనర్లో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్నారు. అనుష్క దేవసేనగా కనిపించనుంది. 
 
ఈ చిత్రం యొక్క కొత్త షెడ్యూల్ ఈ గురువారం (నవంబర్ 14) నుండి కేరళలో మొదలుకానుంది. ఈ చిత్ర బృందం కేరళలో షూటింగ్‌కు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ''బాహుబలి'' సెట్‌కు మెగాస్టార్ చిరంజీవి వెళ్ళారు. ఒక్కసారిగా అనుకొని అతిథిలా వచ్చిన మెగాస్టార్ చూసి యూనిట్ అంతా అవాక్కయ్యారు. చిరంజీవిని చూసిన ప్రభాస్‌ ఒక్కసారిగా ఆయనను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. 
 
ఎందుకంటే... బాహుబలి సెట్ పక్కనే చిరంజీవి ఖైదీ నెం.150 మూవీ షూటింగ్ కూడా జరుగుతుండటంతో విషయం తెలుసుకున్న మెగాస్టార్.. స్వయంగా వెళ్లి బాహుబలి యూనిట్‌తో కాసేపు సరదాగా గడిపారట. అక్కడ ఉన్న దర్శకుడు రాజమౌళి కూడా వారిద్దరిని చూసి ఆనందంతో పులకరించిపోయారు. ఈ విషయాన్ని యూనిట్ సభ్యులు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.

తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో చిరుత

కర్నూలు జిల్లా తుగ్గలిలో బంగారు గని... దేశంలో తొలి ప్రైవేట్ మైన్!!

పెద్దగా ఆవలించింది... దవడ లాక్ అయిపోయింది...

జగన్ లండన్ ట్రిప్.. ఏమవుతుందోనని ఆందోళన.. అయినా భయం లేదు..

బాలుడి ప్రాణాల రక్షణ కోసం ఏకమైన ప్రజలు - రూ.17.5 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కోసం సాయం!!

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments