వెంకటేష్, పవన్ కళ్యాణ్ 'గోపాల గోపాల' చేశాక.. అనుకున్నంతగా నిర్మాతకు డబ్బులు వచ్చాయి. అందుకే నిర్మాత సురేష్ బాబు మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు. ఈసారి కూడా ఓ బాలీవుడ్ చిత్రాన్ని రీమేక్ చేయడానికి పలు చిత్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, రవితేజ కాంబినేషన్లో వెంకటేష్ ఓ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఆ చిత్రం తర్వాత ఏడాది ద్వితీయార్థంలో జరుగుతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథ, కథనాలు చాలా కొత్తగా వుండాలని బాలీవుడ్లోని సురేష్ ప్రొడక్షన్ టీమ్కు తెలియజేసినట్లు సమాచారం. కాగా, సురేష్ప్రొడక్షన్స్ స్వర్ణోత్సవం సందర్భంగా చిత్రం ప్రతిష్టాత్మకంగా వుండేలా చూడాలని సూచించారట.
ఈ చిత్రంలో రామా నాయుడు గారు కూడా నటించేట్లుగా వుండే కథ అయితే బాగుంటుందని తెలుస్తోంది. దీనిపై పలువురు హిందీలోని ఓ మంచి కథ కోసం వెతుకుతున్నట్లు తెలియవచ్చింది.