Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకురానున్న వరుణ్ తేజ్ 'మిస్టర్'

శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిస్టర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీనువైట్ల తన మార్క్ కామెడీని చూపించనున్నాడు. ఊటీ, కర్ణాటకలోని కొన్ని

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (11:16 IST)
శ్రీనువైట్ల దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిస్టర్'. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో శ్రీనువైట్ల తన మార్క్ కామెడీని చూపించనున్నాడు. ఊటీ, కర్ణాటకలోని కొన్ని అందమైన లొకేషన్స్‌లో ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్లో హీరోయిన్ లావణ్య త్రిపాటి హీరోయిన్‌గా నటించనుంది. నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. షూటింగ్‌లో బిజీగా ఉన్న మిస్టర్‌ మూవీకి విడుదల తేదీ నిర్ణయించినట్లు దర్శకనిర్మాతలు అంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 23న ఈ సినిమా రిలీజ్ కానుందట. 
 
కాగా గతేడాది విడుదలైన 'లోఫర్' చిత్రం ప్రేక్షకులని నిరాశపరిచింది. ''ఆగడు'', ''బ్రూస్ లీ'' వంటి భారీ పరాజయాల తర్వాత శ్రీనువైట్ల తీస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ తేజ్, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం 'ఫిదా'. ఈ చిత్రం బాన్సువాడ షెడ్యుల్ ఇటీవలే పూర్తి చేసుకుంది. త్వరలోనే అమెరికా షెడ్యుల్ ప్రారంభం కానుందని సినీ నిపుణులు అంటున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. 
 

హిందూపురంలో తక్కువ శాతం ఓటింగ్ నమోదు ఎందుకని?

పవన్ కల్యాణ్ సెక్యూరిటీ గార్డు వెంకట్ ఇంటిపై దాడి

ముళ్లపందిని వేటాడబోయి మూతికి గాయంతో అల్లాడిన చిరుతపులి - video

జూన్ 4న ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి దేశం ఉలిక్కిపడుతుంది: వైఎస్ జగన్

డిబిటి పథకాల కింద నిధుల విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments