మెగా హీరో వరుణ్ తేజ్ ''కంచె'' సినిమా సూపర్ హిట్ తర్వాత నటించిన ''లోఫర్'' చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. ''లోఫర్'' పరాజయం తర్వాత కొంత విరామం తీసుకున్న వరుణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీబి
మెగా హీరో వరుణ్ తేజ్ ''కంచె'' సినిమా సూపర్ హిట్ తర్వాత నటించిన ''లోఫర్'' చిత్రం తీవ్ర నిరాశనే మిగిల్చింది. ''లోఫర్'' పరాజయం తర్వాత కొంత విరామం తీసుకున్న వరుణ్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్నాడు. ''ఆనంద్'', ''గోదావరి'' వంటి కూల్ చిత్రాలను తెరకెక్కించి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో క్రేజీ డైరెక్టర్గా నిలిచిన శేఖర్ కమ్ముల ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్గా ఎంపిక చేసుకున్నారు.
వరుణ్ హీరోగా నటిస్తున్న రెండు సినిమాల్లో ఒకటైన శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న''మిస్టర్'' ఇటీవలే స్పెయిన్ షెడ్యూల్ పూర్తి చేసుకోగా, ఆ షెడ్యూల్ అయిపోయిన వెంటనే వరుణ్ మరో సినిమా ''ఫిదా'' ఫస్ట్ షెడ్యూల్ను మొదలుపెట్టేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బాన్సువాడలో శరవేగంగా జరుగుతోంది.
ఈ చిత్రంలోవరుణ్ తేజ్ ఓ ఎన్నారైగా నటిస్తున్నాడు. ఇక రెండు సినిమాలతో పూర్తిగా బిజీగా మారిపోయానని, ప్రస్తుతం 'ఫిదా' వర్క్తో పూర్తిగా ప్రేమలో పడిపోయానని వరుణ్ మీడియాకు ఈ సందర్భంగా తెలిపారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. బాన్సువాడలోనే మరికొద్దిరోజుల పాటు షూటింగ్ జరగనుందని యూనిట్ సభ్యులు అంటున్నారు.