Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాల్‌తో ప్రేమలో పడిన శరత్ కుమార్ కుమార్తె... ఆన్‌ స్క్రీన్‌పై రొమాన్స్‌కు సై...

హీరో శరత్ కుమార్‌కు, యువ హీరో విశాల్‌కు మధ్య వ్యక్తిగత వైరం ఎప్పటి నుంచో వుంది. తన కుమార్తె వరలక్ష్మిని ప్రేమలో పడేశాడన్న కోపం విశాల్‌పై ఉంది. పైగా, నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్‌ ప్యానెల్‌ను విశ

Webdunia
మంగళవారం, 30 మే 2017 (12:15 IST)
హీరో శరత్ కుమార్‌కు, యువ హీరో విశాల్‌కు మధ్య వ్యక్తిగత వైరం ఎప్పటి నుంచో వుంది. తన కుమార్తె వరలక్ష్మిని ప్రేమలో పడేశాడన్న కోపం విశాల్‌పై ఉంది. పైగా, నడిగర్ సంఘం ఎన్నికల్లో శరత్ కుమార్‌ ప్యానెల్‌ను విశాల్ వర్గం చిత్తుగా ఓడించింది. దీంతో వారిద్దరి మధ్య వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శరత్ కుమార్ కుమార్తెతో ఆన్‌ స్క్రీన్‌పై రొమాన్స్ చేసేందుకు విశాల్ సిద్ధం కావడాన్ని శరత్ కుమార్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. 
 
ప్రస్తుతం ఈ వార్తే కోలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది. కలిసి నటించింది ఒకే ఒక్క సినిమాలో అయినా చిన్నప్పటి నుండి స్నేహితులు కావడంతో విశాల్ - వరలక్ష్మీ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ నడుస్తోందని కోలీవుడ్ వర్గాలు ఎప్పటి నుండో చెబుతున్నాయి. శరత్ కుమార్‌తో వైరం కారణంగా బయటకు వ్యక్తం చేయడం లేదు కానీ... విశాల్... వరలక్ష్మీని వివాహం చేసుకునేది ఖాయమనీ కొందరంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో 'మదగజరాజా'లో తొలిసారి జోడీ కట్టిన ఈ జంట... ఇప్పుడు మరోసారి స్క్రీన్‌ను షేర్ చేసుకోబోతోంది... విశాల్ నటించి, నిర్మించబోతున్న 'పందెం కోడి' సీక్వెల్‌లో వరలక్ష్మీ ఓ కీలక పాత్ర పోషించబోతోందట. లింగుస్వామి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రం తొలి భాగంలో మీరా జాస్మిన్ హీరోయిన్‌గా నటించగా... ఇందులో కీర్తి సురేశ్ చేస్తోంది... అయితే మరో కీలకమైన పాత్రకు వరలక్ష్మీని ఎంపిక చేశారట. విశేషం ఏమంటే... ఇప్పటికే ఆరేడు సినిమాలతో బిజీ బిజీగా ఉన్న వరలక్ష్మి... విశాల్ మీద ప్రేమతో ఈ సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసి ఇచ్చిందట... జులైలో సెట్స్ కెళుతున్న 'పందెం కోడి' సీక్వల్ ఈ లవర్స్‌ను ఇంకెంత దగ్గర చేస్తుందో చూడాలి. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Pic Talk: నారా లోకేష్- పవన్ కల్యాణ్ సోదర బంధం.. అన్నా టికెట్ కొనేశాను..

Pawan Kalyan: పెట్టుబడులను ఆకర్షించడానికి బలమైన శాంతిభద్రతలు కీలకం: పవన్ కల్యాణ్

Independence Day: తెలంగాణ అంతటా దేశభక్తితో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Stree Shakti: మహిళలతో కలిసి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్, నారా లోకేష్ (video)

ఏపీ అసెంబ్లీ భవనంలో రూ.1.5 కోట్ల వ్యయంతో హై-స్పీడ్ ప్రింటింగ్ యంత్రాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

తర్వాతి కథనం
Show comments