Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - నాగ్ అశ్విన్ మూవీలో టాలీవుడ్ స్టార్, ఎవరా స్టార్..?

Webdunia
శుక్రవారం, 16 అక్టోబరు 2020 (23:09 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే నటిస్తుంది. బిగ్ బి అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ ప్రాజెక్ట్ పై మరింత ఆసక్తి ఏర్పడింది.
 
వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో ఈ సినిమాని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.
 
 అది ఏంటంటే... త‌మిళ‌, మ‌ల‌యాళ సినీ పరిశ్రమల నుంచి ఒక్కో అగ్ర క‌థానాయ‌కుడు ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తార‌ని స‌మాచారం. తెలుగు నుంచి కూడా ఓ ప్ర‌ముఖ న‌టుడు ఈ సినిమాలో భాగం పంచుకోబోతున్నార‌ని తెలిసింది.
 
పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కుతున్న చిత్ర‌మిది. అన్ని భాష‌ల వారినీ ఆక‌ట్టుకోవాలి. అందుకే… వివిధ భాష‌ల‌కు చెందిన న‌టీన‌టుల‌కు ఈ సినిమాలో చోటు క‌ల్పించ‌బోతున్నారు. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ సినిమాని ఏ మాత్రం రాజీపడకుండా నిర్మిస్తున్నారు.
 
 కాగితాల మీదే 250 కోట్ల బడ్జెట్ ఉంటే.. ఇక సెట్స్ పైకి వెళ్లిన తర్వాత ఈ బడ్జెట్ మరింత పెరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సెట్స్ పైకి వెళ్లకుండానే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గోదావరిలో వరదలు: దేవీపట్నం నుండి పాపికొండలకు పడవ యాత్ర బంద్

Karnataka: గుండెపోటుతో మరణాలు కోవిడ్ వ్యాక్సిన్‌తో సంబంధం లేదు.. కేంద్రం

గగనతలం నుంచి ఏకంగా 26 వేల అడుగుల నుంచి కిందికి జారుకున్న ఫ్లైట్...

సిగాచీ కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదం : 13 మంది మిస్సింగ్

Tirumala: శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు- ఎన్డీయే ప్రభుత్వం పట్టించుకోదా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

తర్వాతి కథనం
Show comments