మినిమం ఓపెనింగ్‌ను రాబట్టుకోలేకపోతున్న టాలీవుడ్ హీరోలు!!

ఠాగూర్
గురువారం, 3 ఏప్రియల్ 2025 (14:22 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన కొందరు హీరోలు ఇపుడు తమ సినిమాలకు మినిమం ఓపెనింగ్స్ కూడా అందుకోలేకపోతున్నారు. వీరు నటిస్తున్న చిత్రాలకు కనీసం వారు తీసుకుంటున్న పారితోషికాన్ని కూడా తిరిగి రాబట్టలేకపోతున్నారు. ఇలాంటి హీరోల్లో రవితేజ, నితిన్, వరుణ్ తేజ్ వంటి పలువురు హీరోలు ఉన్నారు. ఇలాంటి హీరోల థియేట్రికల్ మార్కెట్ మైనస్‌లోకి వెళ్ళిపోతుంది. 
 
వరుణ్ తేజ్ నటించిన గత మూడు చిత్రాల మినిమం రూ.3 కోట్ల షేర్‌ను కూడా వసూలు చేయలేకపోయింది. అలాగే, మాస్ మహరాజ్ రవితేజ నటించిన నాలుగు చిత్రాలు ఒకదాన్ని మించి మరొకటి పరాజయం పాలయ్యాయి. నితిన్‌కు గత నాలుగేళ్ళుగా ఐదు ఫ్లాప్స్ వచ్చాయి. నిన్నమొన్నటివరకు ఓటీటీ డీల్స్ అయినా అయ్యేవి. ఇపుడు ఇలాంటి హీరోల చిత్రాలకు కష్టమైపోయాయి. 
 
ప్రొడక్షన్ హౌస్‌లు తీసే స్టార్ హీరోల సినిమాలతో కలిపి ఈ చిత్రాలను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'మజాకా' సినిమాకు టాక్ బాగున్నప్పటికీ సందీప్ కిషన్‌కు ఆడియన్స్‌‍ను థియేటర్‌కు రప్పించే ఛాన్స్ లేకపోవడంతో ఆశించిన స్థాయిలో వసూళ్ల రాలేదు. ఓవరాల్‌గా స్టార్ హీరోల మినహాయిస్తే మిగతా హీరోల భవిష్యత్ ఇపుడు అగమ్యగోచరం అన్నట్టుగా ఉందని చెప్పొచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ అభివృద్ధి అదుర్స్.. క్యూ2లో రాష్ట్రం జీఎస్డీపీలో 11.28 శాతం పెరుగుదల.. చంద్రబాబు

Jagan: జగన్ కడప బిడ్డా లేక కర్ణాటక బిడ్డా: రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి ప్రశ్న

పూర్వోదయ పథకం కింద రూ.40,000 కోట్ల ప్రాజెక్టులు.. ప్రతిపాదనలతో సిద్ధం కండి..

తెలంగాణాకు పెట్టుబడుల వరద : రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.75 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్స్

అయ్యప్ప భక్తులూ తస్మాత్ జాగ్రత్త... ఆ జలపాతం వద్ద వన్యమృగాల ముప్పు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, తులసి పొడిని తేనెలో కలిపి తాగితే...

తమలపాకులు ఎందుకు వేసుకోవాలి?

సులభంగా శరీర బరువును తగ్గించే మార్గాలు

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

తర్వాతి కథనం
Show comments