జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా ఓ ఫంక్షన్కు ముఖ్య అతిథిగా రావాలంటే మరో హీరో ఆ కార్యక్రమానికి రాకూడదా.. ఇదే చర్చ ఇపుడు ఫిల్మ్ నగర్లో జోరుగా సాగుతోంది. గురువారం రామానాయుడు స్టూడియోలో మరో సినీవారసుని చిత్రం ప్రారంభోత్సవం కార్యక్రమం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ, విజయనిర్మల కుటుంబానికి చెందిన సీనియర్ నరేష్ కొడుకు నవీన్ హీరోగా పరిచయమవుతున్నాడు. సినీరంగ ప్రముఖులు కొద్దిమంది హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి మహేస్బాబు, ఎన్టిఆర్ హాజరుకానున్నట్లు బ్రోచర్లు, ఆహ్వాన పత్రికల్లో ముద్రించారు. అయితే సినిమా ప్రారంభోత్సవం అంతా మహేష్బాబు రాకతో ఒక్కసారిగా రామానాయుడు స్టూడియో ఫ్యాన్స్ సందడి నెలకొంది. మహేష్బాబు సింపుల్గా వచ్చిన క్లాప్ కొట్టేసి వెళ్ళిపోయారు.
అయితే, జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడానికి.. మహేస్ వస్తే.. తనకు ప్రాధాన్యత తగ్గుతున్నట్లు భావించినట్లుగా అక్కడివారు మాట్లాడుకోవడం విశేషం. ఎటువంటి ఫక్షన్ అయినా.. ఎన్టిఆర్ హాజరుకావాలంటే. మరో పెద్ద హీరో గానీ, ముఖ్య అతిథికానీ వుండకూడదనే మెలిక పెడతాడని ఫిల్మ్ నగర్ కథనాలు విన్పిస్తున్నాయి.