Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతిలక్ష్మీ ఈవెంట్‌ కోసం కెల్విన్‌కు పూరీ డబ్బులిచ్చారా? అరెస్ట్ చేయరట..

టాలీవుడ్‌ను షేక్ చేసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సిట్ విచారణకు హాజరయ్యారు. బుధవారం (19)న డైరెక్టర్ పూరీని సిట్ ముందు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ సహా 12మంది సినీ ప్రము

Webdunia
బుధవారం, 19 జులై 2017 (18:42 IST)
టాలీవుడ్‌ను షేక్ చేసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ సిట్ విచారణకు హాజరయ్యారు. బుధవారం (19)న  డైరెక్టర్ పూరీని సిట్ ముందు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో పూరీ జగన్నాథ్ సహా 12మంది సినీ ప్రముఖులకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలో హైద‌రాబాద్ డ్ర‌గ్స్ కేసులో ఈనెల 19 నుంచి 27 వ‌ర‌కు ఎక్సైజ్‌శాఖ అనుమానిత ఫిల్మ్‌స్టార్స్‌ వద్ద విచారణ మొదలెట్టింది. ఇటీవ‌ల ప‌ట్టుబ‌డిన‌ డ్ర‌గ్ రాకెట్ కేసులో సుమారు 12 మందిని ఇప్ప‌టికే పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద నుంచి ఎల్ఎస్‌డీ, ఎండీఎంఏ మ‌త్తు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో డ్రగ్స్ వ్యవహారంలో సిట్ అధికారుల విచారణ ఎదుర్కొంటున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ పలు విషయాలు చెప్పినట్టు సమాచారం. 
 
కెల్విన్ బ్యాంక్ అకౌంట్‌కు పూరీ డబ్బులు పంపిన ఆధారాలను, అతనితో ఉన్న ఫొటోలను పూరీ జగన్నాథ్‌కు అధికారులు చూపించినట్టు సమాచారం. పూరీ, ఛార్మీ కాంబోలో వచ్చిన 'జ్యోతిలక్ష్మి' ఈవెంట్ కోసం కెల్విన్‌కు తాను డబ్బులు ఇచ్చానని అధికారులతో పూరీ చెప్పినట్టు సమాచారం. కెల్విన్ తెలిసినప్పటికీ, డ్రగ్స్ ముఠాతో ఎలాంటి సంబంధం లేదని పూరీ ఇప్పటికే అధికారులకు చెప్పినట్టు తెలుస్తోంది. పూరీ ద్వారానే ఛార్మి, రవితేజకు డ్రగ్‌ ముఠాతో సంబంధాలు ఏర్పడినట్టు అధికారులు భావిస్తున్నారు. దీంతో పూరీని అరెస్ట్ చేయరని సమాచారం.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

రాగల 48 గంటల్లో పాకిస్తాన్ ముక్కలవుతుందా? పాక్ లోని బెలూచిస్తాన్ స్వతంత్ర దేశమవుతుందా?

పాకిస్తాన్ ప్రజల్లో యుద్ధ భయం: డబ్బు కోసం ATMల ముందు బారులు

Operation sindhoor కి ప్రతీకారంగా ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు: 16 మంది మృతి, 150 మందికి పైగా గాయాలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసు: మళ్లీ చిక్కుల్లో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మి

సింధూర్ ఎఫెక్ట్: మౌలానా మసూద్ అజార్ కుటుంబంలో పది మంది పోయారు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments