నిర్మాతపై ఫైరైన సుమంత్... ఏం జ‌రిగింది..?

Webdunia
సోమవారం, 31 డిశెంబరు 2018 (16:39 IST)
అక్కినేని ఫ్యామిలీ హీరో సుమంత్ న‌టించిన తాజా చిత్రం ఇదం జ‌గ‌త్. ఈ చిత్రం ఈ నెల 28న రిలీజైంది. ఈ చిత్రంలో సుమంత్ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్ పోషించారు. ఇంకా చెప్పాలంటే... ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌న‌టువంటి నెగిటివ్ షేడ్ క్యారెక్ట‌ర్ చేసాడు. దీనిపై చాలా ఆశ‌లు పెట్టుకున్నాడు. కానీ... ఈ సినిమా ఫ‌ర‌వాలేద‌నిపించింది కానీ... క‌లెక్ష‌న్స్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. దీనికి కార‌ణం ఈ సినిమా రిలీజైంది అనేది ఫిల్మ్ స‌ర్కిల్స్‌లోనే స‌రిగా తెలియ‌దు. ఏమాత్రం ప‌బ్లిసిటీ లేదు.
 
దీంతో సుమంత్‌కి బాగా కోపం వ‌చ్చింద‌ట‌. నిర్మాత‌కు ఓ లేఖ రాసాడ‌ట‌. ప‌బ్లిసిటీ చేయ‌లేన‌ప్పుడు సినిమా తీయ‌డం ఎందుకు..? అంటూ లేఖలో పేర్కొన్నాడట. ఇప్ప‌టివ‌ర‌కు త‌న సినిమాల‌కు ఎప్పుడూ ఇంత త‌క్కువ క‌లెక్ష‌న్స్ రాలేదనీ, ప‌బ్లిసిటీ చేయ‌లేమ‌ని ముందే చెప్పుంటే అది నేనే చూసుకునేవాడిని క‌దా అని చాలా సీరియ‌స్ అయ్యాడ‌ట‌. సుమంత్ చెప్పిందాంట్లో నిజం ఉంది. కానీ.. ఇప్పుడు తెలుసుకుని ఏం ప్ర‌యోజ‌నం. జ‌ర‌గాల్సింది జ‌రిగిపోయింది. ఇకనైనా సుమంత్ ఆచితూచి అడుగులు వేస్తే బాగుంటుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

తర్వాతి కథనం
Show comments