Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్న శ్రీదేవి కుమార్తె!! (Video)

Webdunia
బుధవారం, 22 జులై 2020 (08:36 IST)
భారతీయ చిత్ర పరిశ్రమ అతిలోక సుందరి శ్రీదేవి. ఈమె కుమార్తె జాన్వీ కపూర్. దఢక్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. కానీ, తన తల్లి శ్రీదేవికి స్టార్‌డమ్ చేకూర్చిపెట్టిన తెలుగులో మాత్రం ఆమె ఎంట్రీ ఇవ్వలేక పోయింది. 
 
శ్రీదేవిలా జాన్వీని కూడా తెలుగు ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటారని భావించి, టాలీవుడ్ దర్శకనిర్మాతలు ఎందరో ఆమెను టాలీవుడ్‌కు పరిచయం చేయాలని చూశారు. చిరు, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' సీక్వెల్ చేయాలని, అందులో జాన్వీ కపూర్‌ని నటింపచేయాలనే ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆమె మాత్రం ఈ ఆఫర్లను తిరస్కరిస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న కొత్త ప్రాజెక్టు ఫైటర్. ఈ చిత్రంలో హీరోయిన్‌గా జాన్వీని తీసుకుని టాలీవుడ్‌కి ఆమెని పరిచయం చేయాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె బిజీగా ఉన్నానంటూ ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. కానీ ఇప్పుడు ఆమె టాలీవుడ్ ఆఫర్స్ వదులుకుని తప్పు చేశానని ఫీలవుతుందట. 
 
దీనికి కారణం లేకపోలేదు. ఆమెకి టాలీవుడ్ ఆఫర్స్ వచ్చినప్పుడు బిజీ అని చెప్పి చేసిన చిత్రాలన్నీ ఇప్పుడు థియేటర్‌లో కాకుండా ఓటీటీలో విడుదల అవుతున్నాయి. వెండితెరపై తన వైభవాన్ని చూసుకోవాలనుకున్న ఆమె కోరిక అస్సలు నెరవేరలేదు. ఇప్పుడామె నటించిన చిత్రాలన్నీ ఓటీటీ బాటే పడుతున్నాయి. దీంతో ఆమె బాగా డిజప్పాయింట్ అవుతుందట. 
 
అందుకే టాలీవుడ్‌ నుంచి వచ్చిన ఆఫర్లను ఎందుకు వదులుకున్నానా? అని ఎంతో ఫీలవుతుందట. అయితే ఎక్కడైనా ఇప్పుడు అవే పరిస్థితులు ఉన్నాయి కదా!. థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేనప్పుడు ఏ నిర్మాతలైనా.. చేసేది అదే కదా..! దీనికి ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అంటూ ఆమె సన్నిహితులు జాన్వీకి నచ్చజెపుతున్నారట. ఏది ఏమైనా చేతులు కాలిన తర్వాత ఆకులుపట్టుకున్న చందంగా జాన్వీ కపూర్ పరిస్థితి మారింది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Mother Thanks: చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపిన ఎసమ్మ అనే మహిళ.. ఎందుకు?

ఒంటిపూట బడులు.. ఉదయం 6.30 గంటలకే తరగతులు ప్రారంభం!!

మహిళ ఛాతిని తాకడం అత్యాచారం కిందకు రాదా? కేంద్ర మంత్రి ఫైర్

ఢిల్లీ నుంచి లక్నోకు బయలుదేరిన విమానం... గగనతలంలో ప్రయాణికుడు మృతి!!

దేవాన్ష్ పుట్టిన రోజు - తిరుమల అన్నప్రసాద వితరణకు రూ.44 లక్షలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments