Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓటీటీకి స‌ర్కారువారి పాట - పోకిరితో పోలికే లేదు

Webdunia
శుక్రవారం, 13 మే 2022 (12:50 IST)
Maheshbabu
ఇటీవ‌లే విడుద‌లైన స‌ర్కారువారిపాట గురించి ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ సినిమాపై ర‌క‌ర‌కాలుగా టాక్ వ‌చ్చినా నిర్మాత‌లు సంతోషంగా వున్న‌ట్లు ప్రెస్‌మీట్ పెట్టి మ‌రీ చెప్పారు. అయితే క‌థాబ‌లంతోపాటు సామాజిక సందేశం వున్న ఈ సినిమాకు ఎంట‌ర్‌టైన్‌మెంట్‌జోడించి చూపించారు. దీనిపై కె.రాఘ‌వేంద్ర‌రావు వంటి ప్ర‌ముఖులు మ‌హేష్ బాగా చేశాడ‌ని కితాబిచ్చేశారు.
 
కానీ సినిమా విడుద‌ల‌కుముందు పోకిరీ సినిమాతోనే చిత్ర యూనిట్ పోల్చింది. అస‌లు పోకిరి సినిమాకూ దీనికి ఏమాత్రం సంబంధంలేదు. పోకిరిలో మ‌హేస్‌బాబు స‌ర‌దాగా హీరోయిన్‌ను ఆట‌ప‌ట్టిస్తుంటాడు. కానీ ఇందులో హీరోయిన్ కీర్తి సురేష్ ఛీటింగ్ పేరుతో ఆట‌ప‌ట్టిస్తుంది. అందులోని పాయింట్ ద‌ర్శ‌కుడు పూరీ టేకింగ్ క‌థ‌లో మ‌లుపులు స‌రికొత్త‌గా అనిపిస్తాయి. స‌ర్కారువారిపాట‌లో అలాంటి మ‌లుపులు ఏమీ లేవు. కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం ఇలా చేశార‌ని తెలుస్తోంది.

ఇక మ‌హేష్‌బాబు బాలీవుడ్‌పై మాట్లాడిన మాట‌లు చాలామంది ర‌క‌ర‌కాలుగా విశ్లేషించారు. వ‌ర్మ అయితే అస‌లు మ‌హేష్‌బాబు మాట‌లు నాకేం అర్తంకాలేదు అన్నాడు. ఇప్పుడు పోకిరి సినిమాతో పోల్చ‌డం కూడా అటువంటిదే అని ప‌లువురు ప్ర‌ముఖులు పేర్కొంటున్నారు.
 
ఇక ఇప్పుడు ఈ సినిమాను నాలుగు వారాల త‌ర్వాత అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి. భారీ ఆఫ‌ర్‌తో ఈ సినిమాను వారు కొనుగోలుచేశారు.

సంబంధిత వార్తలు

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments