Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత సంచలన నిర్ణయం.. నయనతార అడ్వైజ్ ఆయుర్వేద చికిత్స కోసం..? (video)

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (18:35 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకుంది. అరుదైన వ్యాధితో బాధపడుతూ వస్తోన్న సమంత ఇకపై సినిమాలకు దూరం కానుందనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. 
 
ఈ వ్యాధి కోసం ఆమె చికిత్స తీసుకుంటోంది. ఇందుకోసం కేరళకు వెళ్లినట్లు సమాచారం. లేడి సూపర్ స్టార్ నయనతార సూచన మేరకు సమంత ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి నుంచి తాను త్వరలో కోలుకుంటానని చెప్పిన సమంత ప్రస్తుతం సినిమాల్లో కనిపించేది లేదని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేంతవరకు సినిమాలకు ఆమె దూరం కావాలని భావిస్తున్నట్లు సమాచారం. హిందీలో ది ఫ్యామిలీ సీజన్ 2 కార్యక్రమం విజయం సాధించడంతో, పలు బాలీవుడ్ సినిమాలను సమంత అంగీకరించింది. కానీ వ్యాధి కారణంగా ఆమె కొంత బ్రేక్ తీసుకోవాలనుకుంటుంది. దీంతో బాలీవుడ్ సినిమాల్లో సమంత ఇప్పటికీ నటించేది లేదని తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు కూడా సమంత చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా పూర్తయిన తర్వాత సినిమాలకు సమంత కొంతకాలం దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments