సమంత సంచలన నిర్ణయం.. నయనతార అడ్వైజ్ ఆయుర్వేద చికిత్స కోసం..? (video)

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (18:35 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకుంది. అరుదైన వ్యాధితో బాధపడుతూ వస్తోన్న సమంత ఇకపై సినిమాలకు దూరం కానుందనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. 
 
ఈ వ్యాధి కోసం ఆమె చికిత్స తీసుకుంటోంది. ఇందుకోసం కేరళకు వెళ్లినట్లు సమాచారం. లేడి సూపర్ స్టార్ నయనతార సూచన మేరకు సమంత ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి నుంచి తాను త్వరలో కోలుకుంటానని చెప్పిన సమంత ప్రస్తుతం సినిమాల్లో కనిపించేది లేదని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేంతవరకు సినిమాలకు ఆమె దూరం కావాలని భావిస్తున్నట్లు సమాచారం. హిందీలో ది ఫ్యామిలీ సీజన్ 2 కార్యక్రమం విజయం సాధించడంతో, పలు బాలీవుడ్ సినిమాలను సమంత అంగీకరించింది. కానీ వ్యాధి కారణంగా ఆమె కొంత బ్రేక్ తీసుకోవాలనుకుంటుంది. దీంతో బాలీవుడ్ సినిమాల్లో సమంత ఇప్పటికీ నటించేది లేదని తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు కూడా సమంత చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా పూర్తయిన తర్వాత సినిమాలకు సమంత కొంతకాలం దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఇకపై కొనసాగలేను : డీకే శివకుమార్

పుట్టపర్తిలో ప్రధాని మోడి పాదాలకు నమస్కరించిన ఐశ్వర్యా రాయ్ (video)

తమిళనాడులో డిజిటల్, స్టెమ్ విద్యను బలోపేతం చేయడానికి సామ్‌సంగ్ డిజిఅరివు కార్యక్రమం

తెలంగాణలో ఒకటి, భారత్‌వ్యాప్తంగా 10 అంబులెన్స్‌లను విరాళంగా అందించిన బంధన్ బ్యాంక్

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments