Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమంత సంచలన నిర్ణయం.. నయనతార అడ్వైజ్ ఆయుర్వేద చికిత్స కోసం..? (video)

Webdunia
మంగళవారం, 20 డిశెంబరు 2022 (18:35 IST)
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత సంచలన నిర్ణయం తీసుకుంది. అరుదైన వ్యాధితో బాధపడుతూ వస్తోన్న సమంత ఇకపై సినిమాలకు దూరం కానుందనే వార్త ఫ్యాన్స్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవల సమంత తనకు మయోసైటిస్ అనే వ్యాధి సోకినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. 
 
ఈ వ్యాధి కోసం ఆమె చికిత్స తీసుకుంటోంది. ఇందుకోసం కేరళకు వెళ్లినట్లు సమాచారం. లేడి సూపర్ స్టార్ నయనతార సూచన మేరకు సమంత ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యాధి నుంచి తాను త్వరలో కోలుకుంటానని చెప్పిన సమంత ప్రస్తుతం సినిమాల్లో కనిపించేది లేదని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకునేంతవరకు సినిమాలకు ఆమె దూరం కావాలని భావిస్తున్నట్లు సమాచారం. హిందీలో ది ఫ్యామిలీ సీజన్ 2 కార్యక్రమం విజయం సాధించడంతో, పలు బాలీవుడ్ సినిమాలను సమంత అంగీకరించింది. కానీ వ్యాధి కారణంగా ఆమె కొంత బ్రేక్ తీసుకోవాలనుకుంటుంది. దీంతో బాలీవుడ్ సినిమాల్లో సమంత ఇప్పటికీ నటించేది లేదని తెలుస్తోంది. 
 
ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలకు కూడా సమంత చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమా పూర్తయిన తర్వాత సినిమాలకు సమంత కొంతకాలం దూరం కావాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ నేతను కత్తితో పొడిచి.. శవాన్ని ముక్కలు నరికి....

Pawan Kalyan: శర్మిష్ట పనోలి అరెస్ట్.. స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

బీఎండబ్ల్యూ కారు కొనివ్వలేదనీ యువకుడు బలవన్మరణం...

భారత్‌లో కరోనా కలకలం.. జూన్ ఒకటికి 3758 కేసు - డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments