Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా అభిమాన దర్శకుడితో సినిమా చేస్తున్నా.. చాలా సంతోషంగా ఉంది : సాయి ధరమ్ తేజ్

సాయిధరమ్ తేజ్ హీరోగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం తిక్క. ఈ హీరో వరుస సినిమాల హిట్లతో మాంచి ఊపుమీదున్నాడు. ఇదిలావుంటే దర్శకుడు కృష్ణవంశీ ''గోవిందుడు అందరివాడేలే'' చిత్రం తర్వాత సందీప్ కిషన్ హీర

Webdunia
శుక్రవారం, 12 ఆగస్టు 2016 (11:04 IST)
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించి విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం తిక్క. ఈ హీరో వరుస సినిమాల హిట్లతో మాంచి ఊపుమీదున్నాడు. ఇదిలావుంటే దర్శకుడు కృష్ణవంశీ ''గోవిందుడు అందరివాడేలే'' చిత్రం తర్వాత సందీప్ కిషన్ హీరోగా ''నక్షత్రం'' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సందీప్‌కిషన్‌కి జంటగా రెజీనా నటిస్తోంది. ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ ఓ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నాడు. 
 
రియల్ లైఫ్‌లో సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్ మంచి మిత్రులు. అందుకే స్నేహితుల రోజు సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు దర్శకుడు కృష్ణవంశీ ప్రకటించారు. ''ఎప్పుడూ నవ్వుతూ కనిపించే నా యంగ్ ఫ్రెండ్ సాయి ధరమ్ తేజ్ మా చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించబోతున్నారు" అని కృష్ణవంశీ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి ''నా అభిమాన దర్శకుల్లో ఒకరైన కృష్ణవంశీతో సినిమా చేస్తుండడం ఆనందంగా ఉంది'' అని సాయిధరమ్ తేజ్ వెల్లడించాడు. త్వరలో సాయిధరమ్‌తేజ్ షూటింగ్‌లో పాల్గొంటాడని కృష్ణవంశీ పేర్కొన్నారు.

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments