Webdunia - Bharat's app for daily news and videos

Install App

''సాహో''లుక్ ఆగస్టు 15న వచ్చేస్తుందట.. ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశాడట..

రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుకుంటున్న 'సాహో' చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు

Webdunia
శనివారం, 29 జులై 2017 (16:20 IST)
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుకుంటున్న 'సాహో' చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో రాబోతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఆగస్టు 15న రిలీజ్ చేసే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. దాదాపు రూ.150కోట్ల బడ్జెట్‌‍తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా షూటింగులో ప్రభాస్ ఇంకా పాల్గొనలేదు. అయితే ఆయన లుక్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 
 
తొలుత ఈ సినిమా నుంచి ఒక ప్రీ లుక్‌, టీజర్‌ను వదిలారు. ఆ తర్వాత ఎలాంటి లుక్స్ విడుదల కాలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ చెందారు. అందుకే ఫ్యాన్స్ కోసం ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఆగస్టు 15న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. బాహుబలి2 తర్వాత రాజమౌళి సినిమా ఏమిటనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఈ నేపథ్యంలో ప్రభాస్ కోసం రాజమౌళి కథ రెడీ చేశారని తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. ప్రభాస్‌ కోసం పక్కా కమర్షియల్‌ కథను రెడీ చేశారట రాజమౌళి. అయితే ప్రభాస్, రాజమౌళి రేంజ్‌ను మరింత పెంచే విధంగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్ వస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments