Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెన్నైలో రహస్యంగా 'రోబో-2' షూటింగ్... మారువేషంలో రజినీకాంత్!

Webdunia
శుక్రవారం, 20 మే 2016 (12:28 IST)
సెన్సేషనల్ దర్శకుడు శంకర్ సూపర్ స్టార్ రజినీకాంత్ కాంబినేషన్‌లో రూపొందుతున్న తాజా చిత్రం "రోబో 2.0". ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' చిత్రం బాక్సీఫీస్ రికార్డు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. దీంతో సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అంతే భారీ స్థాయిలో తెరకెక్కించాలని దర్శకుడు భావిస్తున్నారు. ఈ చిత్ర్రాన్ని సుభాస్కరన్ అల్లిరాజా లైక ప్రొడక్షన్స్ బ్యానర్ పై దాదాపు రూ.350 కోట్ల అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 
 
ఈ చిత్రంలో అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తుంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో మెయిన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఏ ఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్నారు. కాగా ఈ చిత్రంలో హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన టెక్నిషియన్స్‌ని శంకర్ తీసుకున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం చెన్నై‌లో శరవేగంగా జరుగుతోందట. అది కూడా ఎవ్వరికీ తెలియకుండా చాలా రహస్యంగా శంకర్ షూట్ చేస్తున్నాడట. 
 
రజినీకున్న పాపులారిటితో షూటింగ్ ఇక్కడే జరుగుతోందని తెలిస్తే చాలా మంది అభిమానులు వస్తుంటారు. అందువల్ల షూటింగ్‌కి అంతరాయం కలుగుతుందని భావించిన శంకర్ చెన్నైలోని విజయ ఫోరం మాల్‌ని పెద్ద మొత్తం చెల్లించి అద్దెకు తీసుకొని మరి రాత్రి వేళల్లో షూటింగ్ చేస్తున్నారట. ఈ షెడ్యుల్‌లో అక్షయ్ కుమార్‌తో పాటు రజినీకాంత్ కూడా పాల్గోననున్నాడట. 

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments