Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్ అందాలను చూసేందుకే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు.. చూపిస్తే తప్పేంటి : రష్మి

బుల్లితెరపై ఓ రేంజ్‌లో అందాల విందు చేసిన రష్మి, వెండితెర రీ ఎంట్రీ అవకాశం వచ్చేపాటికి చెలరేగిపోయింది. ''గుంటూరు టాకీస్'లో రష్మి పరచిన అందాల విందు చూసి సినీ జనాలే అవాక్కయ్యారు. అలాగే మరికొన్ని చిత్రాలల

Webdunia
శనివారం, 15 అక్టోబరు 2016 (09:39 IST)
బుల్లితెరపై ఓ రేంజ్‌లో అందాల విందు చేసిన రష్మి, వెండితెర రీ ఎంట్రీ అవకాశం వచ్చేపాటికి చెలరేగిపోయింది. ''గుంటూరు టాకీస్'లో రష్మి పరచిన అందాల విందు చూసి సినీ జనాలే అవాక్కయ్యారు. అలాగే మరికొన్ని చిత్రాలలో అదే స్థాయి సౌందర్యాలను బహిరంగపరిచడంతో ఒకానొక స్థాయిలో రష్మి అందాల ప్రదర్శన హాట్ టాపిక్ అయ్యింది. అయితే తన పని తానూ చేసుకుపోతున్న రష్మి, తాజాగా ఓ అంశంపై స్పందించింది. సినిమాలంటేనే గ్లామర్ ప్రపంచం… ఆ గ్లామర్ ప్రపంచంలో నాకున్న అందాల ప్రదర్శన చేస్తే తప్పేంటి..? తన అందాలను తెరపై చూపించడంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవంటూ కాస్త బోల్డ్ గానే స్పందించింది. 
 
హీరోయిన్లను అందంగా చూడడానికే ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని, అలా కనిపించడంలో తప్పు అంటే తానూ ఒప్పుకోనని, అందానికి, అసభ్యతకు మధ్య ఉన్న చిన్న గీతను కొందరు మిస్ యూజ్ చేసుకుంటున్నారని తనదైన శైలిలో చెప్పుకొచ్చింది రష్మి. అయితే తాజాగా విడుదలకు సిద్ధమైన ''తను వచ్చేనంట'' సినిమాతో సక్సెస్ కొట్టాలని చూస్తున్న రష్మి, ఈ సినిమాకు మునుపెన్నడూ లేనంతగా పబ్లిసిటీ చేసేస్తోంది. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రముఖ కాలేజీలన్నింటిని ఓ రౌండ్ వేసిన రష్మి, యువతను ఆకర్షిస్తూ ''తను వచ్చేనంట'' సినిమాకు పబ్లిసిటీ ఇచ్చుకుంది. జాంభి హర్రర్ నేపధ్యంలో సాగే ఈ సినిమా ట్రైలర్లు ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ చేస్తున్న పబ్లిసిటీ పైనే ఓపెనింగ్స్ ఆధారపడి ఉంటాయి. 
 
తాజాగా ఈ సినిమాకు సంబంధించి రష్మి బ్యాక్ లెస్ హాట్ హాట్ పోస్టర్స్‌ను యూనిట్ సభ్యులు విడుదల చేశారు. అక్టోబర్ 21వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా అయినా రష్మి ఆశిస్తున్న సక్సెస్‌ను చేరుకుంటుందో లేదో వేచి చూడాలి.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments