Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి' బడ్జెట్ రూ.2 బిలియన్లు... శివగామి రెమ్యునరేషన్ రూ.కోటి.. ఇదేం న్యాయం జక్కన్నా?

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం రెండు బిలియన్ రూపాయల వ్యయంతో తెరకెక్కింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ భారీ మొత్తంలో పారితోషికం అందిందనే

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (09:48 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి'. రెండు భాగాలుగా వచ్చిన ఈ చిత్రం రెండు బిలియన్ రూపాయల వ్యయంతో తెరకెక్కింది. ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ భారీ మొత్తంలో పారితోషికం అందిందనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా.. హీరో ప్రభాస్, మరో హీరో రానాలతోపాటు.. హీరోయిన్లు అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్‌ ఇలా ప్రతి ఒక్కరికీ బాగానే ఇచ్చారనే ప్రచారం ఉంది. 
 
అయితే, ఇపుడు ఆశ్చర్యకరమైన వార్త ఒకటి బయటకువచ్చింది. ఈ చిత్రంలో శివగామిగా పాత్ర పోషించిన సీనియర్ నటి రమ్యకృష్ణకు ఇచ్చిన రెమ్యునరేషన్ జస్ట్ రూ.కోటి మాత్రమేనట. నిజానికి ఈ పాత్రకోసం తొలుత సీనియర్ నటి శ్రీదేవిని దర్శకుడు రాజమౌళి ఎంపిక చేశారు. ఇందుకోసం ఆమె రూ.5 కోట్లు డిమాండ్ చేయగా, అందుకు ఆయన సరేనన్నారు కూడా. 
 
చివరి నిమిషంలో ఆయన ఎమనుకున్నారో ఏమోగానీ.. శ్రీదేవి స్థానంలో రమ్యకృష్ణ చేరిపోయింది. అయితే రమ్యకృష్ణ ఈ సినిమాకుగాను రూ.కోటి మాత్రమే పారితోషికం ఇచ్చారట. అంత భారీ కాన్వాస్‌తో తెరకెక్కిన సినిమాకు రమ్య పాత్రకు రూ.కోటి అంటే తక్కువేనని అంటున్నారు. ఇంత భారీ బడ్జెట్‌తో తీసిన ఈ చిత్రానికి రమ్యకృష్ణ పాత్ర అత్యంత కీలకం. అలాంటి పాత్రకు కేవలం రూ.కోటి ఇవ్వడం ఏమంటని సినీ విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో జక్కన్న తీరు ఏంబాగోలేదని వారు అంటున్నారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి ఫరూఖ్‌కు భార్యావియోగం... చంద్రబాబు - పవన్ సంతాపం

టీడీపీ నక్రాలు చేస్తే 10 మంది ఎంపీలను బీజేపీ లాగేస్తుంది : ప్రొఫెసర్ నాగేశ్వర్ (Video)

ఢిల్లీ హైకోర్టు జడ్జి నివాసంలో అగ్నిప్రమాదం.. మంటలు ఆర్పివేశాక బయటపడిన నోట్ల కట్టలు!!

Two headed snake: శివాలయంలో రెండు తలల పాము.. వీడియో వైరల్

దేశ, ప్రపంచ నగరాల్లో శ్రీవారి ఆలయాలు.. బాబు వుండగానే క్యూలైన్‌లో కొట్టుకున్న భక్తులు.. (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments