Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాంగోపాల్ వర్మ నెక్ట్స్ టార్గెట్ ఉదయ్ కిరణ్ బయోపిక్, కారణం అదే..!

Webdunia
శనివారం, 25 జులై 2020 (13:12 IST)
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం పవర్ స్టార్. ఈ మూవీ ట్రైలర్‍కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఇక సినిమా ఎలా ఉంటుందో అనే ఆసక్తి ఏర్పడింది. అయితే... వర్మ ఈ సినిమా ఎనౌన్స్ చేసినప్పుడు ఎవరూ కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు. మెగా హీరోలు ఎవరూ స్పందించలేదు.
 
అభిమానులు కూడా సీరియస్‌గా తీసుకోకపోవడంతో పవర్ స్టార్ పైన క్యూరియాసిటీ అంతగా లేదనిపించింది. అయితే... విడుదల తేదీ దగ్గరపడిన రెండు రోజులకు వర్మ ఆఫీస్ పైన పవన్ అభిమానులు దాడి చేయడంతో పవర్ స్టార్ వార్తల్లో నిలిచింది. వివాదస్పదం అయ్యింది.
 
 వర్మకు కావాల్సింది ఇదే. పబ్లిసిటీ వచ్చేసింది. ఈ సినిమాకి కౌంటర్‌గా పరాన్నజీవి అంటూ మరో సినిమా వస్తుండటం తదితర కారణాలతో వర్మ ఆశించిన బజ్ వచ్చేసింది.
 
ఇక ఈ సినిమా తర్వాత ఏ సినిమా తీయనున్నాడు అంటే... ఉదయ్ కిరణ్ బయోపిక్ అని తెలిసింది. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచి ఈ సినిమా గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. తేజ దర్శకత్వంలో ఉదయ్ కిరణ్‌ బయోపిక్ అని ప్రచారం జరిగింది. ఆ తర్వాత తేజ కాదు వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో ఉదయ్ కిరణ్ బయోపిక్ రానుందని టాక్ వచ్చింది. ఈ రెండు జరగలేదు.
 
ఇప్పుడు వర్మ ఉదయ్ కిరణ్ బయోపిక్ తీయాలనుకున్నాడట. కారణం ఏంటంటే... ఉదయ్ కిరణ్‌‌కి చిరు డాటర్‌తో నిశ్చితార్ధం కావడం... ఆ తర్వాత క్యాన్సిల్ అవ్వడం.. ఆ తర్వాత చిరు వలనే అవకాశాలు లేకుండాపోయాయి అని ప్రచారం జరిగింది. ఉదయ్ కిరణ్ బయోపిక్ తీస్తే... చిరు ఫ్యామిలీని మరోసారి టార్గెట్ చేయడానికి అవకాశం ఉంటుందనే వర్మ ఉదయ్ కిరణ్ బయోపిక్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments