Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ బ్రోపై వైకాపా ఫైర్.. పూనమ్ కౌర్‌ సెటైర్లు.. వద్దు సిస్టర్ అన్న వర్మ..

Webdunia
శుక్రవారం, 4 ఆగస్టు 2023 (11:09 IST)
జనసేన అధినేత, నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ జంటగా ఇటీవల విడుదలైన బ్రో చిత్రం థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందుకు సముద్రఖని దర్శకత్వం వహించారు. 
 
ఈ సినిమా ఏపీలో పెద్ద ఎత్తున రాజకీయ దుమారం రేపింది. గతంలో సంక్రాంతి సంబరాల్లో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చేసిన నృత్యానికి సంబంధించిన పేరడీ వివాదానికి దారితీసింది. బ్రో సినిమాలో ఓ సీన్‌లో కమెడియన్ పృథ్వీ మంత్రి అంబటి రాంబాబును ఇమిటేట్ చేస్తూ డ్యాన్స్ చేయడంతో పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. 
 
దీనిపై ఇప్పటికే అంబటి రాంబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్‌పై విరుచుకుపడ్డారు. మరోవైపు ఈ విషయంపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ కూడా స్పందించింది. 
 
తాజా రాజకీయాలు, బ్రో సినిమా వివాదాలను దృష్టిలో పెట్టుకుని పూనమ్ కౌర్ సెటైర్లు వేసింది. రాజకీయాలు వినోదాత్మకంగా మారాయని, వినోదం అంత సీరియస్‌గా మారిందని ట్వీట్‌ చేసింది. ఈ ట్వీట్‌పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ: వద్దు సిస్, నిజానికి రాజకీయాలు సినిమాగా మారాయని, సినిమా రాజకీయంగా మారిందని అనుకుంటున్నాను... అంటూ వర్మ తెలిపాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు : మంత్రి కుమార స్వామి

నాతో గడిపేందుకు హోటల్ గదికి రా, లేదంటే నీ ఏకాంత వీడియోలు బైటపెడతా: టెక్కీ సూసైడ్

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

జనసేన-తెదేపా మధ్య చిచ్చు పెట్టిన కోడిపందేలు, ఏం జరుగుతోంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments