Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మతోడు... పవన్ కళ్యాణ్‌పై అలాంటి ట్వీట్లు చేయను : రాంగోపాల్ వర్మ

వివాదాస్పద ట్వీట్లతో చెలరేగిపోయే దర్శకుడు రాంగోపాల్ వర్మ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వివాదాస్పట ట్వీట్లు చేయబోనని ఒట్టు వేశాడు. అయితే, తన ఒట్టుకు ఏ మేరకు కట్టుబడి ఉంటాడన్నది ఇపుడు సందేహాస్పందంగా మ

Webdunia
బుధవారం, 12 ఏప్రియల్ 2017 (17:18 IST)
వివాదాస్పద ట్వీట్లతో చెలరేగిపోయే దర్శకుడు రాంగోపాల్ వర్మ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వివాదాస్పట ట్వీట్లు చేయబోనని ఒట్టు వేశాడు. అయితే, తన ఒట్టుకు ఏ మేరకు కట్టుబడి ఉంటాడన్నది ఇపుడు సందేహాస్పందంగా మారింది. 
 
సాధారణంగా అర్థరాత్రి దాటిన తర్వాత దేవుళ్లపై, స్టార్‌ హీరోలపై వివాదాస్పద ట్వీట్లు చేయడంలో రాంగోపాల్ వర్మకు మంచి పేరున్న విషయం తెల్సిందే. ముఖ్యంగా మెగా హీరోలపై ఆయన చేసే ట్వీట్లు ఎంతో సంచలనం సృష్టించాయి. నటుడు నాగబాబు అయితే, రాంగోపాల్ వర్మపై మాటలతో యుద్ధం కూడా చేశారు. ఈ నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఒట్టు వేసుకున్నారు. 
 
‘నా వ్యాఖ్యాలతో బాధకు గురైన గణపతి భక్తులకు, పవన్‌కల్యాణ్‌ అభిమానులకు క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నాకు దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి నా మాటలు మీరు నమ్మకపోవచ్చు. అందుకే మా అమ్మ మీద, దర్శకుడు స్పీల్‌బర్గ్‌ మీద, అమితాబ్‌ బచ్చన్‌ మీద ఒట్టేసి చెబుతున్నాన’ని ట్వీట్‌ చేశాడు. బాలీవుడ్‌ నటుడు విద్యుత్‌ జమాల్‌ వల్లే తాను మారుతున్నట్టు చెప్పాడు.
 
కాగా, ఇలాంటి ఒట్టు వేసిన రెండు గంటల్లోనే బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌నుద్దేశించి రాంగోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో ష్రాఫ్‌ను ఓ మహిళతో పోల్చారు.

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments