Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ బయోపిక్... రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో..... నిజమా?

స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ నిర్మితంకానుంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ నిర్మించి నటించనున్నారు. అయితే, ఇలాంటి ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై టాలీవుడ్

Webdunia
సోమవారం, 3 జులై 2017 (13:53 IST)
స్వర్గీయ ఎన్టీ.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్ నిర్మితంకానుంది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ నిర్మించి నటించనున్నారు. అయితే, ఇలాంటి ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ఎవరు డైరెక్ట్ చేస్తారనే దానిపై టాలీవుడ్‌లో ఆసక్తి నెలకొంది. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడి జీవిత విశేషాలను కళ్లకు కట్టినట్లు చూపించగలిగే సత్తా ఉన్న డైరెక్టర్ ఎవరా అని నందమూరి అభిమానులు చర్చించుకుంటున్నారు. 
 
ఈనేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌పై ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాకు వివాదాస్పద డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తారని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం బాలయ్యతో ‘పైసా వసూల్’ మూవీ చేస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఇటీవల ఫేస్‌బుక్ లైవ్‌లో చెప్పిన మాట ఇందుకు మరింత బలాన్ని చేకూరుస్తోంది.
 
బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయనతో పాటు ఫేస్‌బుక్ లైవ్‌కు వచ్చిన పూరీ జగన్నాథ్.. ‘వర్మ-బాలయ్య’ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని చెప్పిన విషయం తెలిసిందే. ఇటీవల ‘రక్తచరిత్ర, వంగవీటి’ వంటి సినిమాలు తీసిన వర్మ.. మనసుపెట్టి ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తే ఆ సినిమా రికార్డు సృష్టించడం ఖాయమని సినీ జనాలు భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై నందమూరి అభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు- ప్రజలు అప్రమత్తంగా వుండాలి.. ఐఎండీ హెచ్చరిక

చిన్నపిల్లలతో వెళుతూ ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే ఇక జేబుకు చిల్లే

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments