ఒక్కరోజు స్టే కోసం కోట్ల రూపాయల ఇంటిని కొన్న రామ్ చరణ్?

Webdunia
మంగళవారం, 13 జులై 2021 (22:23 IST)
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటుడే కాదు మంచి బిజినెస్ మేన్ కూడా. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మార్కెట్‌కు అనుగుణంగా తన వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా చరణ్ అనేక సంస్ధలను స్థాపించారట. ఇదివరకే ముంబైలోని సముద్రతీరంలో అధునాతన బంగ్లాలను కొనుగోలు చేశారు.
 
నటీనటులు షూటింగ్‌ల కోసం వివిధ ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. అక్కడ వారు హోటళ్లలో బసచేస్తారు. అయితే ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలలో నటించే రామ్ చరణ్ తరచూ ముంబై వెళ్ళి నిర్మాతలను కలిసి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిసారి హోటళ్లలో దిగడం.. దానికి వేలకు వేలు ఖర్చుపెట్టడం ఎందుకనే ఆలోచనలోనే ఇళ్ళు కొనుగోలు చేశారట.
 
ముంబై శివార్లలో సంపన్నులు నివశించే ప్రాంతంలో ఇళ్లను కొనుగోలు చేయడమే కాకుండా తనకు ఉపయోగం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చరణ్ సన్నిహితులు చెబుతున్నారు. చరణ్ కొనుగోలు చేసిన ఇళ్ళు బీచ్ ఫేస్‌లో ఎంతో విలాసవంతంగా ఉందని.. ఈ ఇంటికి దాదాపు 35 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు చరణ్ ఫ్యామిలీతో సహా అక్కడికి వెళ్ళి ఎన్నిరోజులైనా స్టే చేసే విధంగా ఇళ్ళు కొనుగోలు చేశారని సన్నిహితులు చెబుతున్నారు. 
 
అయితే షూటింగ్‌కు వెళ్ళినప్పుడు ఒకటి, రెండురోజులు మాత్రమే అక్కడ ఉంటారట. మిగిలిన రోజులు మొత్తం ఆ ఇల్లు ఖాళీగానే ఉంటుందట. ఒక్కరోజు కోసం ఎందుకు అంత వెచ్చించి ఇంటిని కొన్నావని ఉపాసన అడిగితే బయట హోటళ్ళలో ఉండటం ఇష్టం లేదని చెర్రీ చెబుతున్నాడట. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

18న ఫిబ్రవరి నెల శ్రీవారి ఆర్జిత సేవల టిక్కెట్ల కోటా రిలీజ్

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువును హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments