రూ.80కోట్లతో డ్రీమ్ హౌస్.. చెర్రీ ఉపాసన ఆ ఇంటికి షిఫ్ట్ అయ్యాకే.. పిల్లల గురించి ఆలోచిస్తారట..!
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారి వివాహం జరిగి దాదాపు నాలుగేళ్లు పూర్తయింది. ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నారు. అయితే వీరి వ
టాలీవుడ్ యంగ్ హీరో రామ్ చరణ్ తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసనను ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. వారి వివాహం జరిగి దాదాపు నాలుగేళ్లు పూర్తయింది. ఎంతో అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నారు. అయితే వీరి వివాహం సమమంలో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నారు. అందుకు కారణం ఉపాసన అప్పట్లో లావుగా ఉండటమే. తర్వాత కొన్నాళ్లకు ఉపాసన, రామ్ చరణ్ విడిపోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలకు రామ్ చరణ్ స్వయంగా వివరణ ఇచ్చారు. అలాంటిదేమీ లేవని ఆ వార్తలన్ని పుకార్లేనని తేల్చిపారేసారు.
ఇదిలా ఉంటే పెళ్లయి నాలుగు సంవత్సరాలు కావొచ్చినా చెర్రీ-ఉపాసన దంపతులకు పిల్లలు లేరు. వీరికంటే ముందు వివాహం చేసుకున్నఅల్లు అర్జున్ రెండోసారి తండ్రి కాబోతున్నాడు. చెర్రీ మాకు బుల్లి మెగా వారసుడిని ఎప్పుడు ఇస్తాడా? అని అభిమానులు సైతం ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. తాజాగా డైలాగ్ విత్ ప్రేమ అనే ఇంటర్వ్యూలో ఉపాసన ఈ అంశాలపై స్పందించారు. ఇంటర్వ్యూలో ఉపాసన చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలతొ పాటు షాకయ్యే విషయాలు కూడా ఉన్నాయి. మీకు గర్భం, పిల్లలకు జన్మనివ్వడం అంటే భయమటకదా.. అనే ప్రశ్నకు ఉపాసన స్పందిస్తూ… అవును నాకు చాలా భయం. మళ్లీ బరువు పెరుగుతాను. అంతేకాదు..తమకంటూ ప్రత్యేకంగా ఓ సొంత ఇంటిని నిర్మించుకుంటున్నామని అన్నారు.
త్వరలోనే వారి డ్రీమ్ హౌస్కి షిఫ్ట్ అవనున్నామని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నామని అన్నారు. ఆ డ్రీమ్ హౌస్లో చెర్రీ, ఉపాసన ఆనందంగా ఉండడానికి కావాల్సిన అన్ని వసతులను ఏర్పరచుకుంటున్నారట. అందుకోసం దాదాపు 80కోట్ల రూపాయలను ఖర్చు చేశారని సన్నిహితులు అంటున్నారు. అత్యంత సుందరంగా నిర్మిస్తున్న ఆ ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత పిల్లల గురించి ప్లాన్ చేస్తారట చెర్రీ దంపతులు.