Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ 'రాధేశ్యామ్' మూవీ అప్‌డేట్స్ ఏంటంటే...

Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (16:49 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కునున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. 
 
నిజానికి ఈ చిత్రం షూటింగ్ కోసం ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఆసుపత్రి సెట్స్ వేశారు. వచ్చే నెల ద్వితీయార్థం నుంచి షూటింగు నిర్వహించాలని షెడ్యూల్ కూడా వేసుకున్నారు.
 
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. యూరప్‌లో టూరిజం విషయంలో నిబంధనలను సడలిస్తుండడంతో దీనిని సద్వినియోగం చేసుకోవాలని చిత్రం యూనిట్ భావిస్తోందట. దీంతో మొదట్లో అనుకున్నట్టుగానే ఇటలీలోని కొన్ని ప్రాంతాలలో షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట. 
 
ఇందుకోసం చార్టెడ్ ఫ్లయిట్‌ను బుక్ చేసుకుని యూనిట్‌ని అక్కడికి తరలించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ముందుగా ఇటలీలో షూటింగ్ చేస్తారా? లేక రామోజీ ఫిలిం సిటీలో సెట్స్‌లో చేస్తారా? అన్న విషయంలో త్వరలో స్పష్టత వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

South Costal Railway Zone- దక్షిణ కోస్తా రైల్వే జోన్.. కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపిన బాబు, పవన్

ట్రావెల్ బ్యాగులో మృతదేహం మిస్టరీని ఛేదించిన పోలీసులు..

మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీల ఫైనలిస్టుగా తెలుగమ్మాయి..

TTD Ghee Case: టీటీడీ ఉద్యోగులపై వేటు.. వరుస నోటీసులకు సిట్ సన్నద్ధం

చిన్న విషయాలకే భర్త వేధింపులు.. చీరతో ఉరేసుకుని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments