Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ 'రాధేశ్యామ్' మూవీ అప్‌డేట్స్ ఏంటంటే...

ప్రభాస్  రాధేశ్యామ్  మూవీ అప్‌డేట్స్ ఏంటంటే...
Webdunia
సోమవారం, 31 ఆగస్టు 2020 (16:49 IST)
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కునున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. 
 
నిజానికి ఈ చిత్రం షూటింగ్ కోసం ఇప్పటికే రామోజీ ఫిలిం సిటీలో ఆరు కోట్ల రూపాయల వ్యయంతో భారీ ఆసుపత్రి సెట్స్ వేశారు. వచ్చే నెల ద్వితీయార్థం నుంచి షూటింగు నిర్వహించాలని షెడ్యూల్ కూడా వేసుకున్నారు.
 
అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. యూరప్‌లో టూరిజం విషయంలో నిబంధనలను సడలిస్తుండడంతో దీనిని సద్వినియోగం చేసుకోవాలని చిత్రం యూనిట్ భావిస్తోందట. దీంతో మొదట్లో అనుకున్నట్టుగానే ఇటలీలోని కొన్ని ప్రాంతాలలో షూటింగ్ చేయాలని అనుకుంటున్నారట. 
 
ఇందుకోసం చార్టెడ్ ఫ్లయిట్‌ను బుక్ చేసుకుని యూనిట్‌ని అక్కడికి తరలించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి ముందుగా ఇటలీలో షూటింగ్ చేస్తారా? లేక రామోజీ ఫిలిం సిటీలో సెట్స్‌లో చేస్తారా? అన్న విషయంలో త్వరలో స్పష్టత వస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

నా భర్తతో పడుకో, నా ఫ్లాట్ బహుమతిగా నీకు రాసిస్తా: పని మనిషిపై భార్య ఒత్తిడి

పురుషులకు వారానికి రెండు మద్యం బాటిళ్లు ఇవ్వాలి : జేడీఎస్ ఎమ్మెల్యే డిమాండ్

బీజాపూర్ - కాంకెర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ - 22 మంది మావోలు హతం

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments