Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ - రానా కలిసి మరో సినిమా చేయనున్నారా? డైరెక్టర్ ఎవరో తెలుసా?

Webdunia
సోమవారం, 18 మే 2020 (17:28 IST)
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - దగ్గుబాటి రానా కాంబినేషన్లో రూపొందిన సంచలన చిత్రం బాహుబలి. ఈ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించడం.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి చరిత్ర సృష్టించడం తెలిసిందే. బాహుబలి తర్వాత ఓ వైపు ప్రభాస్, మరోవైపు రానా ఇద్దరూ వేరే సినిమాలతో బిజీ అయ్యారు.
 
ఈ ఇద్దరూ పాన్ ఇండియా మూవీస్ చేస్తూ... కెరీర్లో దూసుకెళుతున్నారు. అయితే.. ఇప్పుడు ప్రభాస్ - రానా కలిసి సినిమా చేయనున్నారు అంటూ టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. 
 
ఇంతకీ విషయం ఏంటంటే... ప్రభాస్‌తో దర్శకుడు దశరథ్ మిస్టర్ పర్ఫెక్ట్ అనే సినిమా తీసారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్ రాజు నిర్మించారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందిన ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని సాధించింది.
 
అయితే... మిస్టర్ పర్ఫెక్ట్ తీసిన దర్శకుడు దశరథ్ ఇటీవల ప్రభాస్‌కి ఓ కథ చెప్పారని తెలిసింది. ఈ సినిమాలో విలన్ పాత్రకు రానా అయితే కరెక్ట్‌గా సరిపోతాడని.. రానాని కాంటాక్ట్ చేసి కథ చెప్పాడని టాక్. ఈ కథ విని రానా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.
 
 దీంతో ఈ ప్రాజెక్ట్ పైన మరింత ఆసక్తి ఏర్పడింది. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త వాస్తవమేనా..? కాదా..? అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన సీఎం చంద్రబాబు.. అలా జరిగితే అదే చివరి రోజట...

ఏపీ లిక్కర్ స్కామ్‌ : ఆ ఇద్దరు ఐఏఎస్ అరెస్టు

Lizard: చికెన్ బిర్యానీలో ఫ్రైడ్ బల్లి కనిపించింది.. అదేం కాదులే తీసిపారేయండన్న మేనేజర్!

Heavy rain: గుంటూరు, నెల్లూరులో భారీ వర్షాలు.. మామిడి రైతులకు భారీ నష్టం

Tiruvannamalai: నాలుగు నెలల గర్భవతి.. నా భార్యే ఇక లేదు.. విషం తాగిన భర్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments